Don't Miss!
- News భారత్లో పెట్టుబడులపై ఎలాన్ మస్క్ యూటర్న్?
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
'ఆవారా' గాడు వందరోజులు పూర్తిచేసుకున్నాడు...!
కార్తి, తమన్నా జంటగా తమిళంలో రూపోందిన పయ్యా చిత్రాన్ని తెలుగులో 'ఆవారా' పేరుతో విడుదల చేశారు నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా . ఎన్.లింగుస్వానమి దర్శకత్వంలో రూపోందిన ఈ సినిమా నేటితో వందరోజులు పూర్తిచేసుకుంది. ఈ సంధర్భంగా నిర్మాత మాట్లాడుతూ మా సంస్ధ లో 'కార్తీ' హీరోగా నటించిన 'యుగానికి ఒక్కడు' 100 రోజులు ప్రదర్శింపబడుతుంది.
ఇప్పుడు 'ఆవారా' కూడా అన్ని ముఖ్య పట్టణాల్లో వందరోజులు పూర్తి చేసుకోవడం ఆనందంగా వుంది. ఒకే సంవత్సరంలో 'కార్తీ' హీరోగా నటించిన రెండు సినిమాలు శతదినోత్సవాలను పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సంవత్సరంలోనే కార్తీ హీరోగా నటించిన మరో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నాం అని అన్నారు.
నైజాంలో ఎస్ వీ ఆర్ మీడియా ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేసిన 'శోభారాణి' మాట్లాడుతూ ఆవారా సినిమాకి నైజాంలో మంచి కలెక్షన్స్ వచ్చాయి. మాస్ కేంద్రాల్లో కూడా అద్బుతమైన కలెక్షన్స్ సాధించింది. ఇంత మంచి హిట్ చిత్రాన్ని మాకు అందించిన ఆవారా యూనిట్ కు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.