Don't Miss!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
టీవీల్లో చూపితే తప్పులేదా..సినిమాల్లో ఘోరమా?:దర్శకుడు బాల
శివపుత్రుడు వంటి అద్బుత చిత్రాన్ని తీసిన బాల డబల్ స్టాండర్డ్స్ సెన్సార్ షిప్ పై మండిపడుతున్నాడు. తాను తీసిన నాన్ కడవల్ (నేనే దేముడ్ని) చిత్రం సెన్సార్ లో ఇరుక్కుపోవటాన్ని ప్రస్తావిస్తున్నాడు.సినిమా రిలీజైన ఇంతకాలానికి ఆ ప్రసక్తి రావటానికి కారణం ఉంది. ఓ టీవీ ఛానెల్ వారు కాశీలోని అఘోరాల జీవితంపై పోగ్రాం చేసారు. వారు మనుషుల శవాలని తింటారని చూపించారు. ఆ పోగ్రాం బాగా పాపులర్ అయింది. అది చూసిన బాల తీవ్ర స్ధాయిలో ద్వజమెత్తుతున్నాడు. తాను అవే సీన్స్ తెరపై చూపితే సెన్సార్ వారు కట్ చేసారని, అయితే పాపులర్ టీవీల్లో వాటిని చూపటం ఎంత వరకూ సమంజసం అంటున్నాడు. ఇక తన సినిమా ప్రొమోలు,పోస్టర్స్ చూసి ఫిక్స్ అయిన వారే వచ్చి చూస్తారని, అదే ఛానెల్ లో అయితే చిన్నా పెద్దా అనే తేడాలేకుండా చూస్తారని వివరిస్తున్నాడు. తను తీస్తే తప్పు అయింది..ఛానెల్ లో చూపితే తప్పు ఎందుకు కాదు అని ప్రశ్న వేస్తున్నాడు. ఈ విషయమై ప్రభుత్వం ఆలోచించాల్సిన పని ఉందని చెప్తున్నాడు. కరెక్టే కదా.