Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
డైరక్టర్ బాలా 'పిశాచి' చిత్రం టీజర్ (వీడియో)
చెన్నై : ప్రముఖ తమిళ దర్శకుడు బాలాకు తమిళంలోనే కాదు ఆయన చిత్రాలతో తెలుగు,హిందీలోనూ గుర్తింపు ఉంది. ఇన్నాళ్లూ దర్శకుడుగా కొనసాగిన ఆయన తాజాగా ఓ చిత్రం నిర్మిస్తున్నారు. తన తోటి దర్శకుడు మిష్కిన్ డైరక్షన్ లో ఓ చిత్రం రూపొందిస్తున్నారు. పిశాచి టైటిల్ తో రూపొందే ఈ చిత్రం ఓ మంచి దెయ్యం కథ అని చెప్తున్నారు. ఇప్పుడీ చిత్రం టీజర్ విడుదలై అంతటా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ టీజర్ ని మీరూ ఓ లుక్కేయండి.
బి స్టూడియో బ్యానరుపై బాలా నిర్మిస్తున్న చిత్రం 'పిశాసు'. మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగ, ప్రియాహ నటిస్తున్నారు. సంగీతం అరోల్ కురోలి. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది.
ఈ సందర్భంగా నిర్మాత బాలా మాట్లాడుతూ..'' ప్రతిభావంతులు కష్టాల్లో కొట్టుమిట్టాడటం సహజమే. ఓ మంచి కళాకారుడు నిరాశకు గురికాకూడదనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నా. మంచి కథ రూపొందించడం, దాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించడంలో మిష్కిన్కు ప్రతిభ ఉంది. అన్ని మతాల్లోనూ దేవుడికి వ్యతిరేక శక్తిగా పిశాచం (దెయ్యం) ఉందని చెబుతారు. వాటిలో మంచివి కూడా ఉన్నాయనే అంశంతో ఇది తెరకెక్కించారు. ఇకపై ఏటా మూడు చిత్రాలను నిర్మిస్తా'నని చెప్పారు.
దర్శకుడు మిష్కిన్ మాట్లాడుతూ.. ''చాలా దెయ్యం సినిమాలను చూశాను. పలు కథలను చదివా. వాటిలా కాకుండా కొత్తగా ఉండాలని ఈ కథను రూపొందించా. వంద మంది అమ్మాయిల్లో ప్రియాహ హీరోయిన్గా ఎంచుకున్నాం. ఆమె తక్కువ సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన సన్నివేశాల్లో ఆమె దెయ్యంలాగే నటించారు. ఆమె నటనను చూసి తల్లిదండ్రులు కూడా భయపడ్డారు. యూనిట్ను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి మరీ చిత్రీకరణ సాగించాం. అందుకు తగ్గ ఫలితం దక్కిందన్నారు. కార్యక్రమంలో ప్రియాహ, నాగ తదితరులు పాల్గొన్నారు.