Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సినీ రచయిల నిరసన..అరెస్ట్ కోసం డిమాండ్
చెన్నై : తమిళనాడులో ఇప్పుడు ఎక్కడ చూసినా బీప్ సాంగ్ గురించి చర్చే. సంగీత దర్శకుడు అనిరుధ్, శింబు ల గురించి కామెంటేల్. ఈ వివాదస్పదమైన బీప్ సాంగ్కు రచయితల నుంచి కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
27 మంది రచయితలు గురువారం ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. సినీ గేయ రచయితలు పులమై పిత్తన్, ముత్తులింగం, స్నేగన్, యుగభారతి, ప.విజయ్ తదితరులు విడుదల చేసారు.
ఆ ప్రకటనలో ఏముందంటే... తమిళ చలనచిత్ర రంగం అనే భారీ మాధ్యమం నుంచి విడుదలయ్యే రచనలను కోట్ల మంది ఆస్వాదిస్తున్నారని చెప్పారు. ఆ రచనలే హద్దులు దాటితే పలువురి హృదయాలను గాయపరుస్తాయని తెలిపారు. ప్రస్తుతం వివాదస్పదమైన పాట మహిళలను కించపరచేలా ఉందన్నారు.
ప్రజలు ఇంకా వరద ప్రభావం నుంచి కోలుకోక ముందే మహిళల మనసును గాయపరిచే ప్రక్రియగా ఇది ఉందని పేర్కొన్నారు. విద్యార్థి, మహిళా సంఘాల నిరసనకు మద్దతుగా తాము ఈ ప్రకటన విడుదల చేసినట్లు వివరించారు. ఈ వ్యవహారంలో శింబు, అనిరుధ్లు నిర్దోషులైతే... పాటను విడుదల చేసిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.