Don't Miss!
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
భానుప్రియ కుటుంబంపై లైంగిక వేధింపుల కేసు.. కొత్త మలుపు తిరిగిన వివాదం!
సీనియర్ నటి భానుప్రియ చిక్కుల్లో పడ్డారు. ఇంట్లో పని మనిషి దాఖలు చేసిన లైంగిక వేధింపులు, గృహ హింస కేసు మీడియాలో చర్చనీయాంశమైంది. భానుప్రియ సోదరుడు తనను లైంగికంగా వేధించారనే ఫిర్యాదులో పేర్కొనడం మీడియాలో సంచలనం రేపింది. తనపై, తన సోదరుడిపై పని మనిషి చేసిన ఫిర్యాదుపై భానుప్రియ స్పందించారు. ఆమె ఏమన్నారంటే..
పనిమనిషిపై నగల దొంగతనం ఆరోపణలు
తన ఇంట్లో పనిచేసే మైనర్ బాలిక నగదు, బంగారు నగలు దొంగిలిస్తూ తన సోదరుడు గోపాలకృష్ణన్కు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొన్నారు. సుమారు 25 సవర్ల నగలు దొంగిలించినట్టు ఆరోపణలు చేశారు. దొంగిలించిన నగలు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాం. కొన్నింటిని బాలిక తల్లి తిరిగి ఇచ్చింది. తన సొంత గ్రామానికి వెళ్లి మిగితా వస్తువులు తెచ్చి ఇస్తాం అని చెప్పారు.
భానుప్రియ కుటుంబంపై లైంగిక వేధింపులు
సొంత గ్రామానికి వెళ్లిన పని మనిషి కుటుంబం తమపై తప్పుడు కేసు నమోదు చేసింది. తమపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేయడం చాలా దారుణం. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. పనిమనిషిపై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదు అని భానుప్రియ మీడియాకు వెల్లడించింది.
మైనర్ బాలిక అంశం వివాదంగా
అయితే మైనర్ బాలికను పనిలో పెట్టుకోవడం మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారుతున్నది. చిన్న పిల్లలను పనిలో పెట్టుకోవడం బాల కార్మికుల చట్టాన్ని ఉల్లంఘించడమనే విషయాన్ని పట్టించుకోలేదన వాదన వినిపిస్తున్నది. ఈ వివాదం మరో కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది.
పని అమ్మాయిని హింసించిన కేసు.. తల్లీకూతుళ్ళిద్దరూ, భానుప్రియ సంచలన వ్యాఖ్యలు!
రాజీ ప్రయత్నం దిశగా కేసు
ఆంధ్రప్రదేశ్లో నమోదైన కేసు భానుప్రియకు తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఈ వివాదం మీడియాలో రచ్చగా మారింది. ఇలాంటి సమయంలో భానుప్రియ ఎలా కేసును బయటపడుతారనే విషయంపై అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే భానుప్రియ కుటుంబం చేస్తున్న ఆరోపణలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రెండు వర్గాలను రాజీ కుదిర్చే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలిసింది.