Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దర్శకుడు క్రిష్ దెబ్బకొట్టాడంటూ హీరో...
దర్శకుడు క్రిష్ కధ చెప్పేటప్పుడు ఒకలా చెప్పి సినిమా పూర్తయ్యేసరికి సీన్ మార్చేసాడంటూ తమిళ నటుడు భరత్ కామెంట్ చేసాడు. రీసెంట్ గా తమిళంలో క్రిష్ తన తెలుగు హిట్ వేదం ని రీమేక్ చేసాడు. అందులో భరత్ కి తెలుగులో మనోజ్ చేసిన పాత్ర ఇచ్చాడు. అలాగే అల్లు అర్జున్ పాత్రను శింబు చేసాడు. శింబే ఎక్కువగా పోస్టర్స్ వేసి హైలెట్ చేసి,ఎడిటింగ్ లో తన నిడివి తగ్గించటంతో భరత్ కి కాలి ఇలా యుద్దానికి దిగాడు.
అయితే ఈ మ్యాటర్ పై మరో హీరో శింబు వివరణ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ... ఇద్దరు హీరోల చిత్రంలో ఎవరికి మార్కెట్ ఉంటుందో వారికి ప్రాధాన్యత నిస్తారన్నారు. చిత్రంలో నటించిన నటులందరి ఫొటోలను పోస్టర్లలో వేయలేమని పేర్కొన్నారు. భరత్ ఆరోపణలను తాను పట్టించుకోనని అన్నాడు. ఇక తెలుగులోనూ ఇదే మ్యాటర్ పై అప్పట్లో వివాదం చెల రేగిన సంగతి తెలిసిందే. మొత్తానికి క్రిష్ తమిళంలోకి కూడా వెళ్ళి కథనే కాకుండా వివాదాన్ని కూడా కంటిన్యూ చేసాడన్నమాట.