Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఎస్సై సాక్ష్యం....ఇరుక్కున్న భువనేశ్వరి
భువనేశ్వరి పై మరో రెండు మోసం కేసులు కూడా నమోదయ్యాయి. వ్యభిచార కేసుకు సంబంధించి గత 10వ తేదీ భువనేశ్వరికి సైదాపేట కోర్టు ఛార్జ్షీటు నకలు అందజేసింది. ఆ రోజు కోర్టుకు హాజరైన భువనేశ్వరి... తాను అమాయకురాలినని, తానే పాపం ఎరగనని పేర్కొంది. ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి మేజిస్ట్రేట్ మురుగన్ సాక్షుల వద్ద విచారణను ప్రారంభించారు. వ్యభిచార నిరోధ విభాగం ఎస్సై ధనచెయన్ కోర్టుకు హాజరై భువనేశ్వరికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. యువతులతో ఉల్లాసంగా గడిపేందుకు భువనేశ్వరి తన వద్ద రూ. అయిదు వేలు అడిగారని తెలిపారు. కేసు విచారణను మేజిస్ట్రేట్ మురుగన్ వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీచేశారు.
శృంగార నటి భువనేశ్వరిపై చీటింగ్ కేసుతో పాటు వ్యభిచారం తదితర ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భువనేశ్వరిని రూ. 1.5 కోట్ల చీటింగ్ కు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. టీవీ సీరియల్ నిర్మిస్తానని నమ్మబలికి ఆమె తన వద్ద రూ. 1.5 కోట్లు తీసుకుని మోసం చేసిందని చెన్నై కెకె నగర్ కు చెందిన రఘునాథన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భువనేశ్వరిని విచారించారు. విచారణలో భువనేశ్వరి... తాను అమాయకురాలిని అని వెల్లడించింది. తనకు ఇచ్చింది కొంతే అని. తెల్లకాగితంపై తన సంతకం తీసుకుని ఎక్కువ ఇచ్చినట్లు రాసుకుని తనను మోసం చేసారని భువనేశ్వరి ప్రత్యారోపణలు చేసింది.