twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమిళనాడులో 'కెమెరామేన్ గంగతో రాంబాబు'బిజినెస్ ఎంత?

    By Srikanya
    |

    చెన్నై : పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రం తమిళనాడులోనూ మంచి బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. తమిళ రైట్స్ ఐదున్నర కోట్లు కు అమ్ముడుపోయినట్లు సమాచారం. తెలుగు సినిమాకు అక్కడ మార్కట్లో ఈ రేటు పలకటం చాలా గొప్ప విషయమే అంటున్నారు. తమన్నాకి,ప్రకాష్ రాజ్ కు కూడా అక్కడ మార్కెట్ ఉండటం కలిసివచ్చే విషయంగా భావించి ఈ రేంజి బిజినెస్ జరిగినట్లు తమిళ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

    ఈ చిత్రం ఆడియోని ఈ నెల 24న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు సమాచారం. గెస్ట్ చిరంజీవి వస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ని గ్రాండ్ జరపాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆడియో ఫంక్షన్ కి పవన్ అన్నగారైన చిరంజీవి ఛీప్ గెస్ట్ గా రానున్నారు. గబ్బర్ సింగ్ తర్వతా అన్నదమ్ములు ఇద్దరు మళ్లీ ఒకే స్టేజిపై కనపడనున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు.

    పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. బాబా సెహగల్ ..పవనిజం పై పాడిన పాటను కూడా ఈ చిత్రం ట్రాక్ లో కలుపుతున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మెకానిక్ గా కనిపించనున్నారు. అనుకోని పరిస్ధితుల్లో పవన్ మీడియాలోకి రావటం హైలెట్ కానుంది.'గబ్బర్‌సింగ్‌' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్‌ సినిమాగా బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు.

    ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్

    English summary
    pawan kalyan’s ‘Cameraman Gangatho Rambabu’ is doing sky high business in all the areas. As per the info, it is known that the movie has been sold out to Rs.5.5 lakhs for Tamil Nadu. This is said to be a whopping price for straight Telugu movies in Tamil Nadu.Milky beauty Tamannah is playing lady lead of the movie. Prakash Raj is doing the main villain role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X