Don't Miss!
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వేసింది ఒక్క ట్వీట్.. పోయింది ముగ్గురి పరువు.. దటీజ్ కస్తూరీ శంకర్!!
కోలీవుడ్లో కస్తూరీ పెట్టే చిచ్చు అందరికీ తెలిసిందే. ఈమె చేసే ప్రతీ ట్వీట్ ఓ సంచలనమే. ఆ మధ్య వనితా విజయ్ కుమార్ ఇష్యూలో, మీరా మిథున్ వ్యవహారం వేసిన సెటైర్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. కస్తూరీ చేసే ట్వీట్లు సోషల్ మీడియాలోనే కాకుండా మీడియాలోనూ సెన్సేషనల్ అవుతుంటాయి. ఆమె వేసే ట్వీట్లలో ఉండే సెటైర్లు నెటిజన్లను బాగానే ఆకర్షిస్తుంటాయి. తాజాగా బిగ్ బాస్ షో, వైల్డ్ కార్డ్ ఎంట్రీపై వేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్..
కస్తూరీ శంకర్ లాక్ డౌన్లో ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. వనిత విజయ్ కుమార్ మూడో పెళ్లిపై స్పందించడం, ఆపై ఇద్దరూ పరస్పరంగా వాగ్వాదానికి దిగడం, పరోక్షంగా సెటైర్లు వేసుకుంటూ ఉండటంతో రచ్చ రచ్చగా మారింది. తాజాగా వనిత మూడో పెళ్లి పెటాకులు కావడంపైనా వనిత సెటైర్లు వేసింది.
మీరా మిథున్ను సైతం..
బిగ్ బాస్ మూడో కంటెస్టెంట్ మీరా మిథున్ ఆ మధ్య త్రిష, విజయ్, సూర్య ఇలా స్టార్స్పై పిచ్చి కూతలు కూస్తూ కోలీవుడ్ను నానా రకాలుగా నిందించింది. మీరా మిథున్ వ్యాఖ్యలు అప్పట్లో ఎన్నో వివాదాలకు కారణమైంది. మీరా మిథున్ ట్వీట్లకు కస్తూరీ కూడా అంతే ఘాటుగా స్పందించి కౌంటర్లు వేసింది.. కోలీవుడ్కు మద్దతుగా మీరా మిథున్ను ఏకి పారేసింది.
తాజాగా సుచిత్ర..
ఆర్జే, సింగర్ సుచిత్ర.. సుచీ లీక్స్ పేరిట బాగా ఫేమస్ అయింది. సుచిత్ర బిగ్ బాస్ తమిళ్ నాల్గో సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ విషయంపై కస్తూరీ శంకర్ అదిరిపోయే ట్వీట్ వేసింది. అయితే ఆమె వేసింది ఒక్కటే ట్వీట్ కానీ బిగ్ బాస్ షో, మీరా మిథున్, సుచిత్ర పరువుపోయింది.
ఒక్క కెమెరాతోనే..
బిగ్ బాస్ షోలో ఆర్జే సుచిత్ర వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.. అయితే ఆమె ఒక కెమెరాతోనే ఎంతో సెన్సేషనల్ అయింది.. ఇక వంద కెమెరాల ముందు ఇంకెన్ని చేస్తుందో ఎన్ని లీక్ చేస్తుందో.. బిగ్ బాస్ కంటెస్టెంట్లు ప్లీజ్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని కస్తూరీ కౌంటర్ వేసింది.
Recommended Video
ముగ్గురి పరువు గోవిందా..
అలా సుచిత్ర గురించి కామెంట్ చేసి వదలి పెట్టకుండా అందులోకి మీరా మిథున్ను కూడా లాగింది. సుచిత్ర.. మీరా మిథున్కు 2.ఓ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టేసింది. మళ్లీ బిగ్ బాస్ షోలో అలాంటివి జరుగుతాయన్న హింట్ కూడా ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఇలా ఒక్క ట్వీట్లో సుచిత్ర, మీరా మిథున్ బిగ్ బాస్ పరువులను తీసేసింది.