Don't Miss!
- Sports ధోనీ సార్ ధోనీ.. అంతే: సౌండ్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే..
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్రధాని మోదీ సర్కార్పై విరుచుకుపడ్డ బిగ్బాస్ బ్యూటీ.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు..
తమిళ నటి, బిగ్బాస్ బ్యూటీ ఓవియా హెలెన్ మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో ప్రధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ కార్యకర్త కేసు నమోదు చేయడం కూడా తెలిసిందే. ఈ క్రమంలో ట్విట్టర్లో తన అభిమానులతో ముచ్చటిస్తూ ఓ సెటైర్ వదిలారు. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ..
కొద్ది నెలల క్రితం పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటించారు. ఆ సమయంలో ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ హీరోయిన్ ఓవియా హెలెన్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. #GoBackModi అంటూ ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది.
తమిళనాడు బీజేపీ యూనిట్ సీరియస్
ఓవియా హెలెన్ ట్వీట్ను సీరియస్గా తీసుకొన్న బీజేపీ తమిళనాడు యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రధాని ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసినందుకు ఓవియోపై కేసునమోదు చేశారు. ఇలాంటి వివాదం మరిచిపోకముందే ఓవియా మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
అంతా ఫన్నీగానే ఉందంటూ..
తాజాగా ట్విట్టర్లో ఫ్యాన్స్తో చాట్ చేస్తుండగా.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఓవియా సెటైర్లు వేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వ కార్యక్రమాల గురించి ఒక్క మాటలో సమాధానం ఇవ్వమని అడిగితే తనదైన శైలిలో స్పందించారు. ఏమైంది సార్.. అంతా అంతా ఫన్నీగానే ఉంది అంటూ కామెంట్ చేశారు. బిగ్బాస్లో పాపులర్ అయిన మీమ్ను షేర్ చేశారు.
నటుడు సిద్దార్థ్ కూడా విమర్శలు
ఓవియా హెలెన్ తాజా వ్యాఖ్యలు ట్విట్టర్లో వైరల్ అయ్యాయి. తాజా వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్రశాఖ, మోదీ అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఓవియా పోస్టు చేసిన మీమ్పై ఎలా స్పందిస్తారనే అంశంపై సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇటీవల కాలంలో నటుడు సిద్ధార్థ్ కూడా మోదీని టార్గెట్ చేస్తూ ఘాటైన వ్యాఖ్యల చేయడం తెలిసిందే.