Don't Miss!
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- News ఓటు వెయ్యకపోయినా పర్వాలేదు, నా అంత్యక్రియలకు రండి, ప్రధాని అభ్యర్థి, మోదీని టార్గెట్ చేసి !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విజయ్ను వెంటాడుతున్న మాంసం కత్తి.. వ్యాపారులు బిగిల్ పోస్టర్లు చింపడంతో ఉద్రిక్తత
తమిళ సూపర్స్టార్ విజయ్ సినిమా వస్తున్నదంటే.. వివాదం ముందు పుట్టి ఆ తర్వాత ప్రేక్షకులకు ముందుకు వెళ్తుంది. గతంలో సర్కార్, మెర్సల్, థెరీ చిత్రాలు అందుకు సాక్ష్యంగా నిలిచాయి. తాజాగా ఆయన నటిస్తున్న బిగిల్ చిత్రం కూడా ఓ వివాదంలో కూరుకుపోతున్నది. తాజాగా ఈ సినిమా పోస్టర్పై మాంసం వ్యాపారాలు భగ్గుమంటున్నారు. ఇంతకు బిగిల్ పోస్టర్ విషయంలో ఏం జరిగిందంటే..
బిగిల్పై మాంసం వ్యాపారుల ఆగ్రహం
బిగిల్ సినిమా యూనిట్పై కోయంబత్తూరుకు చెందిన మాంసం వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వృత్తికి సంబంధించిన విషయంలో మా మనోభావాలను దెబ్బ తీశారు. మా వృత్తిని కించపరిచే విధంగా పోస్టర్ను డిజైన్ చేశారు అని అన్నారు. మాంసం కోసే కత్తి విజయ్ పట్టుకోవడం వివాదంగా మారింది.
కోయంబత్తూరులో పోస్టర్లు చించివేత
బిగిల్ పోస్టర్లను పట్టుకొని ఊరేగింపు చేపట్టారు. ఉక్కడమ్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. పోస్టర్లను చించివేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకొన్నది. ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.
మాంసం కత్తి వివాదం
మా పొట్ట కూటి కోసం, వృత్తి కోసం ఉపయోగించే కత్తిని విజయ్ తన కాళ్ల కింద పెట్టుకొన్నాడు. అలాగే మేము గౌరవంగా చూసుకొనే కత్తిని హత్యలకు, నేరాలకు ఉపయోగించడం సరికాదని కోయంబత్తూరు మాంసం వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా చిత్ర యూనిట్, నిర్మాతపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
దీపావళీకి విడుదల
ఇక బిగిల్ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇటీవల చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ చిత్రాన్ని 2019 దీపావళీకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో విజయ్ సరసన నయనతార హీరోయిన్గా నటించగా, యోగిబాబు, జాక్రీ ష్రాప్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.