Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బిందుమాధవిని సిల్క్ స్మితలా ఉంటుందన్న దర్శకుడు
'తుల్లాద మనముం తుల్లుం', 'పెన్నిన్ మనదై తొట్టు', 'దీపావళి', 'పూవెల్లాం ఉన్వాసం', తాజాగా 'మనం కొత్తి పరవై' వంటి ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న దర్శకుడు ఎళిల్. ఇప్పుడు అలాంటి అంశంతోనే జనం ముందుకు రాబోతున్నాడు. పల్లెటూరి ప్రేమకథతో 'దేశింగురాజా' తెరకెక్కిస్తున్నాడు. విమల్, బిందుమాధవి హీరో,హీరోయిన్స్. సినిమా గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ బిందుమాధవి గురించి ఇలా చెప్పుకొచ్చారు.
అలాగే తాను ప్రేమ కథలే తెరకెక్కించటానికి కారణం చెప్తూ...ప్రేమలో విఫలమయ్యాను అన్నారు. కోయంబత్తూరులో నేను డిగ్రీ మొదటి ఏడాది చదివేటప్పుడు తను పీజీ. తొలిచూపు ప్రేమ నాది. వయోభేదం ఉన్నా ఎలాగైనా ఒప్పించాలని అనుకున్నా. పరిచయం పెరిగింది. మంచి స్నేహితులం అయ్యాం. ఒకసారి ప్రాజెక్టు విషయమై గ్రామంలో తనతో బసచేసే అవకాశం కలిగింది. అప్పుడు నా మనసులో మాట చెప్పా. కుదరదని చెప్పేసింది. ఒప్పించేందుకు చాలా ప్రయత్నించా. ఫలించలేదు. ఆ తర్వాత ఆమె నన్ను కలిసేందుకే కాదు.. మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. ప్రేమ బాధను తట్టుకోలేకపోయా. అందుకే ఈ సినీ 'ప్రేమ ప్రయాణం' అన్నారు.
స్టార్ హీరోలు అజిత్, విజయ్ వంటి పెద్ద నటులతో సినిమాలు చేశారు. ఇప్పుడు ఆ స్థాయి తగ్గుతోందనే విమర్శలకు సమాధానం చెప్తూ... ప్రారంభంలో పెద్ద హీరోలతో చేసినందుకే ఇప్పుడు ఆ స్థాయిని కొనసాగించలేకపోతున్నానని అనిపిస్తోంది. వెంటవెంటనే చిత్రాలు చేయలేకపోవడానికి అదే కారణం. నేను తెరకెక్కించిన వాటిలో ఒక్కటి మాత్రమే నిరాశపరిచింది. అదే సమయంలో ఆర్థికంగా కూడా ఇబ్బందులొచ్చాయి. అందుకే స్థాయి తగ్గించుకున్నాను. ఇప్పుడిప్పుడే మునుపటిస్థాయికి చేరుకునేందుకు అడుగులు వేస్తున్నాను అన్నారు.