Don't Miss!
- News మైలవరం టీడీపీలో బయటపడ్డ విభేదాలు
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్రముఖ నటుడు సంతానంపై పోలీసులకు ఫిర్యాదు
తమిళ సినీ ఇండస్ట్రీలో వడివేలు, వివేక్ తర్వాత అంతటి పేరును సంపాదించుకన్న కమెడియన్ సంతానం. ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీని పండించి మెప్పించిన సంతానం.. చాలా అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ వైవిధ్యాన్ని చూపిస్తూ ఎన్నో సినిమాల విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. కొద్దిరోజుల క్రితం హీరో అవతారం కూడా ఎత్తాడు. కమెడియన్గా మెప్పించిన సంతానం.. హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.
ఇందులో భాగంగానే కొన్ని సినిమాలు చేశాడు. 'దిల్లుక్కు దుడ్డు 2' తర్వాత కొంత బ్రేక్ తీసుకున్న సంతానం.. తాజాగా 'ఏ1' అనే సినిమాలో నటించాడు. జయసూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంతానం సరసన తారా అలీసా నటించింది. ఈ సినిమాను రాజ్ నారాయణన్ నిర్మించాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలాంటి సమయంలో 'ఏ1' చిత్ర యూనిట్కు గట్టి షాక్ తగిలింది. చిత్ర హీరో సంతానంపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఈ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని ప్రస్తావిస్తూ విళ్లుపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సంతానంపై బ్రాహణ సమాజం అభివృద్ధి సంఘం రాష్ట్ర లక్ష్య సాధన కార్యదర్శి కార్తీక్ ఆధ్వర్యంలో కొందరు ఫిర్యాదు చేశారు. ''ఈ చిత్రంలో బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచే, ఎగతాలి చేసే సన్నివేశాలు ఉన్నాయి. కాబట్టి చిత్ర దర్శక, నిర్మాతలు, అందులో నటించిన సంతానం తదితర నటీనటులపై తగిన చర్యలు తీసుకోవాలి'' అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సినిమా విడుదల అవుతుందా..? లేదా..? అన్నది ఆసక్తికరంగా మారింది.