Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హాట్ టాపిక్ : పార్వతీ మెల్టన్పై కేసు నమోదు
మరో ప్రక్క హీరోయిన్లు అనుష్క, ప్రియమణిలు సినిమాల్లో అసభ్య వస్త్ర ధారణతో నటిస్తున్నారని, వారి మూలంగా సమాజంలోకి చెడు సంకేతాలు వెలుతున్నాయని సుబద్ధి అనే వ్యక్తి మల్కాజ్ గిరి కోర్టులో ప్రైవేట్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఈ పిటీషన్పై మల్కాజ్ గిరి కోర్టు స్పందించింది.
అనుష్క, ప్రియమణిలపై కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది. మల్కాజ్ గిరి కోర్టు ఆదేశాల మేరకు ఈ ఇద్దరు హీరోయిన్లపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే ఇద్దరు హీరోయిన్లు నోటీసులు అందుకోనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ కేసుపై అనుష్క, ప్రియమణి ఎలా ప్రొసీడ్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.
సినిమాల్లో వీరి వస్త్రధారణ అభ్యంతరకరంగా ఉందని, ఒక రకంగా సమాజంలో మహిళలపై పురుషులు దాడులు చేయడాని పరోక్షంగా కారణం అవుతోందని పిటీషనర్ పేర్కొన్నారు. అంతే కాకుండా సినిమాల్లో వస్త్రదారణ విషయంలో మార్గదర్శకాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు.