Don't Miss!
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్నBird Flu పాలు, గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మణిశర్మపై చార్జిషీటు దాఖలు
చెన్నై : ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మణిశర్మపై పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. మణిశర్మకు నగరంలో నీలాంగరై సమీపంలోని కానాత్తూరులొ సొంత భూమి ఉంది. ఈయన స్థలానికి పక్కనే సేలం నివాసి కరుప్పన్కు చెందిన భూమి ఉంది. తన 75 సెంట్ల భూమిని మణిశర్మ కంచె వేసినట్లు గతంలో కరుప్పన్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన విచారణ ఆలందూరు కోర్టులో జరుగుతోంది. ఈ నేపథ్యంలో మణిశర్మపై గత జూన్ నెల 27వ తేదీన కోర్టులో చార్జిషీటును దాఖలు చేసినట్లు పోలీసులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
వివరాల్లోకి వెళితే... ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ..భూ ఆక్రమణ కేసులో ఇరుక్కున్నారు. ఆయనపై తమిళనాడుకి చెందిన కరూర్ కరుప్పన్ అనే వ్యక్తి కేసు వేసారు. నకిలీ పత్రాలతో దాదాపు 10 కోట్ల విలువ చేసే భూమిని మణిశర్మ కబ్జా చేసినట్లు ఆరోపణ. ఈ విషయమై ఇప్పటికే మణిశర్మ మేనేజర్ ని పోలీసులు కష్టడీలోకి తీసుకున్నారు. ఇంటరాగేషన్ కోసం మణిశర్మను త్వరలో పిలిపిస్తారని తెలుస్తోంది.
తమిళనాడులోని కణాతూర్ దగ్గర కరూర్ కరుప్పన్ అనే వ్యక్తికి డబ్బై ఐదు సెంట్ల భూమి ఉంది. అయితే తన భూమిపై దర్శకుడు మణిశర్మ హక్కులు కలిగి ఉన్నట్లు కరుప్పన్ కి తెలిసింది. దాంతో అతను వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. భూమికి సంభందించిన పత్రాలు పరిశీలించిన పోలీసులు నకిలీ పత్రాలతో ఆ భూమిపై మణిశర్మ హక్కులు సంపాదించినట్లు అనుమానిస్తున్నారు. మేనేజర్ రఘురామన్ పై ఇప్పటికే విచారణ మొదలైంది. రఘురామన్ తెలిపై వివరాలతో మణిశర్మను కూడా పోలీసుల అదుపులోకి తీసుకుంటారని సమాచారం.