Don't Miss!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
నేను అమాయకురాలిని: పోలీసు విచారణలో భువనేశ్వరి
విచారణలో భువనేశ్వరి... తాను అమాయకురాలిని అని వెల్లడించింది. తనకు ఇచ్చింది కొంతే అని. తెల్లకాగితంపై తన సంతకం తీసుకుని ఎక్కువ ఇచ్చినట్లు రాసుకుని తనను మోసం చేసారని భువనేశ్వరి ప్రత్యారోపణలు చేసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవార్లు పోలీసులు విచారణ కొనసాగించారు.
మరో వైపు భువనేశ్వరిపై పదికి పైగా ఫిర్యాదు నమోదయ్యాయి. ఇటీవల ఆమె ఓ థియేటర్ వద్ద అర్ధ నగ్న నృత్యం చేయడం, దానిపై పిర్యాదు నమోదు కావడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. దక్షిణ చెన్నై పరిధిలోని ప్రార్థన థియేటర్ లో తుపాకీ సినిమా ప్రదర్శించబడుతుంది. ఈ సినిమాకు మద్రాస్ హైకోర్టు న్యాయవాది దామోదర్ కృష్ణన్, నటి భువనేశ్వరి కలిసి కారులో థియేటర్ కు వచ్చారు. ఈ కారు ముందు ఉన్న కారు ను ఢీకొనడంతో దామోదర్ కృష్ణన్ ఆ కారుకు చెందిన కుమార్ తో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది.
అదే సమయంలో కారులో ఉన్న భువనేశ్వరి కారు బయటకు వచ్చి ధియేటర్ ముందు తనకు తోచిన రీతిలో చిందు లేసింది. ఆ సమయంలో భువనేశ్వరి తాగిన మైకంలో ఉందని ప్రత్యక్ష సాక్ష్యలు చెబుతున్నారు. తాగిన మైకంలో అర్థనగ్నంగా ఉన్న భువనేశ్వరి థియేటర్ ముందు నృత్యం చేసిందని వారు చెబుతున్నారు. దీనిపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భువనేశ్వరి గతంలో వ్యబిచారం కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయి.