విడాకుల మంజూరుతో...ప్రభు-నయన్ లకు లైన్ క్లియర్..!

By Sindhu

ప్రభుదేవా, నయనతారల వివాహానికి లైన్ క్లియర్ అయిపోయింది. చెన్నయ్ లోని ఫ్యామిలీ కోర్టు ప్రభుదేవా, అతని భార్య రమాలత్ లకు ఈరోజు (070-07-2011)విడాకులు మంజూరు చేసింది. ప్రభుదేవ, రామలత్ ల 15ఏళ్ళ వైవాహిక జీవితానికిగాను రమాలత్ కు భరణంగా పది లక్షల నగదు, రెండు ఫ్లాట్లు, ఓ కారు ఇవ్వాల్సిందిగా ప్రభుదేవాను న్యాయమూర్తి ఆదేశిస్తూ విడాకులు మంజూరు చేశారు. ఈ విషయంలో నాలుగు రోజుల క్రితం తన ఆస్తికి సంబంధించిన దస్తావేజులను ప్రభుదేవా కోర్టుకి సమర్పించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు విడాకులు మంజూరు కావడంతో ప్రభు, నయన్ లు ఊపిరిపీల్చుకున్నారు. త్వరలో ఇద్దరూ వివాహం చేసుకుని, ఓ ఇంటివారు కావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. గత కొన్నాళ్లుగా వీరి ప్రేమ కథ ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చిన సంగతి మనకు తెలుసు. ఇటీవలి కాలంలో ఏ సినీ జంటా ఎదుర్కొనని ఇబ్బందులను, అవాంతరాలనూ వీరు ఫేస్ చేశారు. ప్రియుడి కోసం నయనతార మౌనంగా ఎన్నో అవమానాలను కూడా భరించింది. వీరి ప్రేమాయణం తమిళనాడులో ఎంతో సంచలనం సృష్టించింది. కొన్నిసార్లు ఈ జంట ప్రజాగ్రహానికి కూడా గురైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X