twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విడాకుల మంజూరుతో...ప్రభు-నయన్ లకు లైన్ క్లియర్..!

    By Sindhu
    |

    ప్రభుదేవా, నయనతారల వివాహానికి లైన్ క్లియర్ అయిపోయింది. చెన్నయ్ లోని ఫ్యామిలీ కోర్టు ప్రభుదేవా, అతని భార్య రమాలత్ లకు ఈరోజు (070-07-2011)విడాకులు మంజూరు చేసింది. ప్రభుదేవ, రామలత్ ల 15ఏళ్ళ వైవాహిక జీవితానికిగాను రమాలత్ కు భరణంగా పది లక్షల నగదు, రెండు ఫ్లాట్లు, ఓ కారు ఇవ్వాల్సిందిగా ప్రభుదేవాను న్యాయమూర్తి ఆదేశిస్తూ విడాకులు మంజూరు చేశారు. ఈ విషయంలో నాలుగు రోజుల క్రితం తన ఆస్తికి సంబంధించిన దస్తావేజులను ప్రభుదేవా కోర్టుకి సమర్పించిన సంగతి తెలిసిందే.

    ఇప్పుడు విడాకులు మంజూరు కావడంతో ప్రభు, నయన్ లు ఊపిరిపీల్చుకున్నారు. త్వరలో ఇద్దరూ వివాహం చేసుకుని, ఓ ఇంటివారు కావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. గత కొన్నాళ్లుగా వీరి ప్రేమ కథ ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చిన సంగతి మనకు తెలుసు. ఇటీవలి కాలంలో ఏ సినీ జంటా ఎదుర్కొనని ఇబ్బందులను, అవాంతరాలనూ వీరు ఫేస్ చేశారు. ప్రియుడి కోసం నయనతార మౌనంగా ఎన్నో అవమానాలను కూడా భరించింది. వీరి ప్రేమాయణం తమిళనాడులో ఎంతో సంచలనం సృష్టించింది. కొన్నిసార్లు ఈ జంట ప్రజాగ్రహానికి కూడా గురైంది.

    English summary
    A Family Court in Chennai granted divorce for actor-choreographer-director and his wife Ramalath thus putting an end to their 15 years of married life.The couple had sought divorce by mutual consent after Prabhudeva agreed to part with some property and cash.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X