అసిన్ 'అసిస్టెంట్' మిస్టరీ!

కేసు పూర్వాపరాలు ఇవి. మార్చి 17న ముత్తు తల్లి తన కొడుకు అదృశ్యమయ్యాడంటూ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. ముత్తు మిత్రుల సెల్ నెంబర్లకు ఫోన్ చేసిన పోలీసులకు ముత్తు చెన్నైలోనే ఉన్నట్టు తెలుసుకున్నారు. అతను తన స్నేహితుడు మాధవన్ తో కలిసి తిరుపతి వెళ్ళినట్టు కూడా తెలిసింది. తన మీద మిస్సింగ్ కేసు నమోదు అయితే టెన్షన్ పడి అసిన్ తన కుటుంబానికి డబ్బు ఇస్తుందని ముత్తు ఆశ పడినట్టు తెలుస్తోంది. అతడిని ప్రస్తుతం ఇంటరాగేట్ చేస్తున్న పోలీసులు అసిన్ కు సంబంధించిన రహస్య సమాచారం కూడా పనిలో పనిగా రాబట్టినట్టు చెబుతున్నారు. రేపో ఎల్లుండో ముత్తును పోలీసుకు మీడియా ఎదుట హాజరు పరచవచ్చు.


Click it and Unblock the Notifications











