Don't Miss!
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విశాల హృదయం చాటుకున్న విలక్షణ నటుడు.. కేరళ వరద బాధితుల కోసం!
ఎలాంటి పాత్ర అయినా సరే ప్రాణం పెట్టి చేస్తాడు విక్రమ్. ప్రస్తుతం ఉన్న గొప్ప నటుల జాబితాలో విక్రమ్ ఖచ్చితంగా ఉంటాడు. విలక్షణ నటనతోనే విక్రమ్ దక్షణాదిలో అభిమానులని సొంతం చేసుకున్నాడు. కేరళ వరద భీభత్సం ప్రస్తుతం అందరిని కలచి వేస్తోంది. అన్ని చిత్ర పరిశ్రమల నుంచి నటీనటులంతా పెద్ద ఎత్తున కేరళ కోసం సాయం అందిస్తున్నారు.
ఆ జాబితాలో విక్రమ్ కూడా చేరాడు. భారీ మొత్తంలో కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఆర్థిక సమయం అందించాడు. విక్రమ్ 35 లక్షల ఆర్థిక సాయాన్ని వరద బాధితుల కోసం అందించడం విశేషం. దుల్కర్ సల్మాన్, విజయ్, మెగాస్టార్ చిరంజీవి ఇలా చిత్ర పరిశ్రమలతో బేధం లేకుండా నటీనటులంతా కేరళ కోసం విరాళాలు అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా విక్రమ్ నటించిన స్వామి స్క్వేర్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. 2003 లో ఘన విజయం సాధించిన స్వామి చిత్రానికి ఇది సీక్వెల్. మాస్ చిత్రాల దర్శకుడు హరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.