Don't Miss!
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- News తనపై ఉన్న కేసుల వివరాలను వెల్లడించిన సీఎం జగన్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఓటీటీలో అజిత్ ‘వాలిమై’ విడుదల: మూవీ రిలీజ్పై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్
ఆ మధ్య వరుస పరాజయాలతో ఇబ్బందులు పడ్డాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్. ఇలాంటి పరిస్థితుల్లో రెండేళ్ల క్రితం 'నెర్కొండ పార్వాయి'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమాతో ఇన్ని రోజులూ ఉన్న రికార్డుల దాహాన్ని తీర్చుకున్నాడు. అదే సమయంలో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలను చేసేందుకు సిద్ధం అయ్యాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ స్టార్ హీరో 'వాలిమై' అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీని చేస్తున్నాడు. ఎన్నో అంచనాల నడుమ రూపొందుతోన్న ఈ మూవీ విడుదల గురించి ఎన్నో పుకార్లు షికార్డు చేస్తుండగా.. తాజాగా చిత్ర యూనిట్ దీనిపై క్లారిటీ ఇచ్చింది.
టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్ వినోథ్ దర్శకత్వంలో అజిత్ కుమార్ నటిస్తోన్న చిత్రమే 'వాలిమై'. భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నారని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో చిత్ర యూనిట్ తాజాగా దీనిపై స్పందిస్తూ.. ఆ వార్తలను ఖండించింది. వాలిమై మూవీకి ఓటీటీ సంస్థల నుంచి బిగ్ ఆఫర్స్ వస్తున్న మాట నిజమే అయినప్పటికీ.. తాము ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించినట్లు యూనిట్ సభ్యులు వెల్లడించారు. దీంతో ఈ పుకార్లకు పుల్స్టాప్ పడిపోయినట్లైంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'వాలిమై' సినిమాలో అజిత్ కుమార్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అందులో ఒకటి బైక్ రేసర్ పాత్ర కాగా.. ఇంకోటి మధ్య వయస్కుడి రోల్ అని అంటున్నారు. ఇక, ఈ సినిమాలో బాలీవుడ్ నటి హుమా ఖురేషి కథానాయికగా నటిస్తుండగా.. తెలుగు యువ హీరో కార్తికేయ విలన్గా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు.