ఆమె..కలర్స్.. ఇక తమిళంలో...

వాస్తవ సంఘటనలతో ముడిపడిన ఈ కథ 'సుబ్రమణ్యపురం' అనే మధురై వద్ద వున్న గ్రామం నేపద్యంలో జరుగుతుందిట. 1980 తొలినాళ్లలో అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ జీవితాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనలతో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాలో 'చెన్నై 28' ఫేమ్ జయ్ హీరో. స్వాతి అతని సరసన నటించింది. దర్శకుడు శశికుమార్తో పాటు గంజా కరుప్పు, సముద్రకని ఇతర పాత్రలు పోషించారు. ఇంతకీ ఆమెకీ ఆఫర్ ఎలా వచ్చిందంటే 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' సినిమాని చేస్తున్నప్పుడు తమిళ దర్శకుడు కావటంతో ఆ యూనిట్ వాళ్ళలో చాలా మంది తమిళ వాళ్ళే. వాళ్ళలో కొంత మందికి ఈమె కలుపుగోలుతనం,చిలిపితనం పిచ్చ పిచ్చగా నచ్చేసి ఈ దర్శకుడుకి రికెమండ్ చేసారట. మరి ఈ సినిమా గనుక హిట్టయితే స్వాతి తమిళంలో సెటిలవుతుంది. అప్పుడు మన వాళ్ళూ ఆమె డేట్స్ కోసం పరుగెడతారు.


Click it and Unblock the Notifications











