Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
స్టార్ కమిడియన్ పై దర్శకుడు పోలీసులకు ఫిర్యాదు
వివరాల్లోకి వెళితే... హాస్య నటుడు సంతానం ప్రధాన పాత్రలో నటించిన 'కన్నా లడ్డు తిన్న ఆశయా' చిత్ర కథ తనదంటూ దర్శక నటుడు భాగ్యరాజ్ పోలీసు కమిషనర్ను ఆశ్రయించాడు. సంతానంతో పాటు పవర్స్టార్ శ్రీనివాసన్ తదితరు నటించిన ఈ చిత్రాన్ని సంతానం, రామనారయణన్ సంయుక్తంగా నిర్మించారు. సంతానం ఈ విషయమై బాగ్యరాజాని సంప్రదించి విషయం సెటిల్ చేసుకుని విడుదల చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే భాగ్యరాజ్ సోమవారం కమిషనర్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంటూ.. 1981లో తాను రచించిన కథతో తెరకెక్కిన చిత్రం 'ఇండ్రుపోయ్ నాలై వా' అని, ఇందులో తనతో సహా ముగ్గురు హీరోలు ఒక హీరోయిన్ వెంటపడటం కథ అని, ఈ కథ హక్కులను తనకు ఇవ్వాల్సిందిగా నిర్మాత రామ నారాయణన్ కథను కోరినా తాను అంగీకరించలేదని అన్నారు. అందుకు కారణం తన కుమారుడు హీరోగా తెలుగు, తమిళంలో ఆ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకోవటమే అన్నారు.
అయితే రామనారాయణన్ తన కథ ఆధారంగానే కన్నా లడ్డు తిన్న ఆశయా చిత్రాన్ని నిర్మించారని కనుక రామనారాయణన్పై చర్యలు తీసుకోవాలని భాగ్యరాజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. త్వరలోనే 'కన్నా లడ్డు తిన్న ఆశయా' విడుదల అవుతోంది. ఈ చిత్రం ఇప్పటికే బిజినెస్ సర్కిల్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.