Don't Miss!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- News 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి!: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
స్టార్ కమిడియన్ పై దర్శకుడు పోలీసులకు ఫిర్యాదు
వివరాల్లోకి వెళితే... హాస్య నటుడు సంతానం ప్రధాన పాత్రలో నటించిన 'కన్నా లడ్డు తిన్న ఆశయా' చిత్ర కథ తనదంటూ దర్శక నటుడు భాగ్యరాజ్ పోలీసు కమిషనర్ను ఆశ్రయించాడు. సంతానంతో పాటు పవర్స్టార్ శ్రీనివాసన్ తదితరు నటించిన ఈ చిత్రాన్ని సంతానం, రామనారయణన్ సంయుక్తంగా నిర్మించారు. సంతానం ఈ విషయమై బాగ్యరాజాని సంప్రదించి విషయం సెటిల్ చేసుకుని విడుదల చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే భాగ్యరాజ్ సోమవారం కమిషనర్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంటూ.. 1981లో తాను రచించిన కథతో తెరకెక్కిన చిత్రం 'ఇండ్రుపోయ్ నాలై వా' అని, ఇందులో తనతో సహా ముగ్గురు హీరోలు ఒక హీరోయిన్ వెంటపడటం కథ అని, ఈ కథ హక్కులను తనకు ఇవ్వాల్సిందిగా నిర్మాత రామ నారాయణన్ కథను కోరినా తాను అంగీకరించలేదని అన్నారు. అందుకు కారణం తన కుమారుడు హీరోగా తెలుగు, తమిళంలో ఆ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకోవటమే అన్నారు.
అయితే రామనారాయణన్ తన కథ ఆధారంగానే కన్నా లడ్డు తిన్న ఆశయా చిత్రాన్ని నిర్మించారని కనుక రామనారాయణన్పై చర్యలు తీసుకోవాలని భాగ్యరాజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. త్వరలోనే 'కన్నా లడ్డు తిన్న ఆశయా' విడుదల అవుతోంది. ఈ చిత్రం ఇప్పటికే బిజినెస్ సర్కిల్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.