Don't Miss!
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- News Iran Israel War: ఇరాక్ నూ కెలికిన ఇజ్రాయెల్? ఇరాన్ ఉమ్మడి పోస్టుపై దాడి-పోరు తీవ్రం..!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
విక్రమ్ను వెంటాడిన కరోనావైరస్.. కోబ్రాపై ఎటాక్ అంటూ..
కరోనావైరస్ ప్రభావం సినిమా పరిశ్రమతోపాటు అన్ని రంగాలపై కనిపిస్తున్నది. ఈ ఎఫెక్ట్ ప్రస్తుతం చియాన్ విక్రమ్ నటిస్తున్న కోబ్రా సినిమాపై పడింది. అజయ్ జీ ముత్తు దర్శకత్వంలో వస్తున్న చిత్రం, గత కొద్దిరోజులుగా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్నది. అయితే ఈ సినిమా షూటింగ్కు కరోనా ఎఫెక్ట్ కావడంతో షూటింగ్ను క్యాన్సిల్ చేశారు.
గతవారం క్రితం విక్రమ్తోపాటు చిత్ర యూనిట్ రష్యాకు వెళ్లింది. కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మార్చి 11 వరకు శరవేగంగా జరిగిన ఈ షూట్కు కరోనా వైరస్ అడ్డు తగిలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాణాంతక వ్యాధి అని డిక్లేర్ చేయడంతో షూటింగ్ను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకొన్నారు.
కోబ్రా దర్శకుడు అజయ్ ట్వీట్ చేస్తూ.. కోబ్రాను కరోనా ఎటాక్ చేసింది. భారత ప్రభుత్వం విదేశాల్లో ప్రయాణించవద్దని ఆదేశాలు జారీ చేయడంతో మధ్యలోనే రష్యా షూట్ను రద్దు చేసుకొని వెనుకకు వస్తున్నాం అంటూ పేర్కొన్నారు.
అజయ్ జీ ముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న కోబ్రాలో నయనతార, అనురాగ్ కశ్యప్, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ 25 గెటప్స్లో కనిపిస్తారు. ఇటీవల రిలీజ్ చేసిన కొన్ని గెటప్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.