డబ్బుకోసం నటి హత్య, నిందితులకు జీవితఖైదు
చెన్నై: డబ్బు కోసం నటి హత్య జరిగిన సంఘటనలో నిందితులకు జీవిత ఖైదు పడింది. నటిని హత్య చేసింది బంధువులే కావడం గమనార్హం. హత్యకు గురైన నటి పేరు ఆది లక్ష్మి. పలు తమిళ చిత్రాల్లో సహాయ నటిగా నటించింది. తాము అడిగిన డబ్బు ఇవ్వలేదనే కోపంతో ఆమె బంధువులు ప్రభావతి, ఎడ్వర్డ్ జయకుమార్ 2010 అక్టోరబ్ 15న ఈ దారునానికి ఒడిగట్టారు.

హత్య అనంతరం ప్రభావంతి ఇంట్లోని 4 సవర్ల నగలు, రెండు పట్టు చీరలు, ఒక కెమెరా తీసుకుని పారిపోయారు. ఇటవలే ప్రభావతి, జయకుమార్ పోలీసులకు చిక్కారు. సెసెన్స్ కోర్టు న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు. దీంతో పాటు జరిమానా కూడా విధించారు.
ఈ మధ్య తమిళనాడులో పలువురు సినీ తారలు హత్యకు గురవుతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. ఈ హత్యలన్నీ డబ్బుకు సంబంధించి వ్యవహారాలతో ముడి పడి ఉండటం గమనార్హం. డబ్బుకు సంబంధించిన వివాదాలు, బెదిరింపులు వచ్చినప్పుడు వెంటనే తమకు తెలియజేస్తే ఇలాంటి ఘటనలు అడ్డుకోవచ్చని పోలీసులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











