Don't Miss!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హృదయాలు గాయపరిచాడు: కమెడియన్కు కోర్టు నోటీసులు
హైదరాబాద్: వివాదాలకు మారు పేరైన తమిళ కమెడియన్ విడివేలు మరో వివాదంలో ఇరుక్కున్నారు. తమిళ సినీ నటుల సమాఖ్య 'నడిగర్ సంఘం'పై ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టులో పరువు నష్టం దావా దాఖలైంది. విచారణకు హాజరు కావాలని కోర్టు అతనికి నోటీసులు జారీ చేసింది.
ఇటీవల మదురైలో జరిగిన విలేఖరుల సమావేశంలో దక్షిణ భారత నటుల సంఘం కనిపించలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విడి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న నామక్కల్ జిల్లా నడిగర్ సంఘం కార్యకర్తల సమిటీ సభ్యుడు, జిల్లా నాటక నటుల సంఘ అధ్యక్షుడైన ఆటో రాజా వడివేలుపై కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు.
వడివేలు చేసిన వ్యాఖ్యలు సినీ నటుల హృదయాలను ఆవేదనకు గురి చేశాయని, కావున ఆయనపై చర్యలు చేపట్టాలని పిటిషనలో కోరారు. శుక్రవారం ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి 27వ తేదీన జరిగే విచారణకు వడివేల్ కోర్టుకు హాజరు కావాలంటూ నోటీసు జారీ చేశారు.
గతంలోనూ వడివేలు అనేక వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. ఇటీవల నడిగర్ సంఘంకు జరిగిన ఎన్నికల్లో నాజర్, విశాల్ నేతృత్వంలోని జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. వీరి ఎన్నికపై వడివేలు అసంతృప్తిగా ఉన్నట్లు ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.