కించ పరిచారంటూ పిటీషన్: హీరో ధనుష్కు కోర్టు సమన్లు
చెన్నై: తమిళ నటుడు ధనుష్ కొత్త చిత్రం ‘కాక్కముట్టై' సినిమా ఇబ్బందుల్లో పడింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు న్యాయవాదులను కించపరిచే విధంగా ఉన్నాయంటూ అఖిలభారత న్యాయవాదుల సంఘ పరిరక్షణ సంఘం అధ్యక్షుడు మణివన్నన్ పిటీషన్ దాఖలు చేసారు.

ఈ కేసును విచారణకు స్వీకరించిన చెన్నైలోని ఎగ్మూరు కోర్టు నిర్మాత ధనుష్, వెట్రిమారన్... దర్శకుడు మణికందన్ లకు సమన్లు జారీ చేసింది. సినిమాలో న్యాయవాద వృత్తిని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని, ఈ కేసును విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.


Click it and Unblock the Notifications











