Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వనితా విజయ్ కుమార్కు మళ్లీ మూడో పెళ్లి కష్టాలు.. పీటర్ పాల్ మొదటి భార్య షాక్
తమిళ నటి, బిగ్బాస్ కంటెస్టెంట్ వనితా విజయ్ కుమార్ మళ్లీ కష్టాల్లో పడింది. పీటర్ పాల్తో మూడో వివాహం ఆమెను ఇంకా అతలాకుతలం చేస్తున్నది. జూన్ 27వ తేదీన మూడో పెళ్లి చేసుకొన్న తర్వాత వనితా విజయ్ కుమార్ అనేక వివాదాల్లో కూరుకుపోయారు. అయితే ఇంకా ఆమెను వివాదాలు వెంటాడటం గమనార్హం. అయితే పీటర్ పాల్ భార్య చేసిన ఫిర్యాదు ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకోవడంతో మళ్లీ ఇబ్బందుల్లో పడింది. ఆ కేసు వివరాల్లోకి వెళితే..
వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి కష్టాలు
వనితా విజయ్ కుమార్ మూడో వివాహం కూడా ఊరట కలిగించలేదు. పెళ్లి జరిగిన కొద్ది నెలలకే పీటర్ పాల్ను వదిలేయడం తెలిసిందే. తాగుడుకు బానిస కావడం ఆమె జీర్ణించుకోలేకపోయింది. మూడో పెళ్లికి కూడా గుడ్బై చెప్పింది. అయితే మూడో భర్తను వదిలేసిన ఆ కేసు చిక్కులు వనితను వెంటడుతున్నాయి.
లక్ష్మీ రామకృష్ణన్ ఘాటుగా
మూడో పెళ్లిని చేసుకొన్న వనితా విజయ్ కుమార్ను పలువురు తప్పుపట్టారు. అందులో తమిళ సెలబ్రిటీ లక్ష్మీ రామకృష్ణన్తో సోషల్ మీడియాలో భారీగా వాగ్వాదం చోటు చేసుకొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత పీటర్ మొదటి భార్య ఎలిజబెత్ తరఫున పోరాటం చేసింది. ఆమెకు న్యాయం జరగాలని డిమాండ్ చేసింది.
ఒకరి జీవితంతో ఆడుకొంటూ..
మూడో పెళ్లి విఫలమైనా వనితా విజయ్ కుమార్ను లక్ష్మి రామకృష్ణన్ వదలడం లేదు. ఇద్దరు వ్యక్తులు ఒకరికి అన్యాయం చేశారు. ఆమె జీవితంతో ఆడుకొన్నారు. ఈ వ్యవహారంలో ఎలిజబెత్ న్యాయపోరాటంలో మొదటి విజయాన్ని సాధించింది అంటూ లక్ష్మీ రామకృష్ణన్ వెల్లడించింది.
Recommended Video
సెలబ్రిటీ అయినా చట్టం నుంచి తప్పించుకోలేరు..
వనితా విజయ్ కుమార్ని పరోక్షంగా టార్గెట్ చేసుకొంటూ ఓ సెలబ్రిటీ చేసిన తప్పు వల్ల ఓ వ్యక్తి జీవితం రోడ్డున పడింది. అలాంటి వ్యక్తికి న్యాయం జరిగిందనే భరోసాను ఈ కేసు కలిగిస్తున్నది. ఎవరైనా సరే.. ఎలాంటి ప్రముఖులైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరు అంటూ లక్ష్మీ రామకృష్ణన్ ట్వీట్ చేశారు.