Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అంజలికి మరో షాక్
సేలం రెండో జ్యుడీషియల్ మేజిస్ట్రేటుకు కలంజియం నడుపుతున్న తమిళ్ నల ఇయక్కం సంఘం కార్యకర్త మురుగన్ పిటిషన్ అందజేశారు. తమిళ అభివృద్ధికి పాటుపడే తమ సంఘ అధ్యక్షుడు కలంజియంపై నటి అంజలి ఆరోపణలు చేయడం ఆవేదన కలిగిస్తోందన్నారు.
కలంజియం తనను ఏటీఎంలా వాడుకున్నారనే ఆరోపణ సత్యదూరమని ఈ విషయమై నటి అంజలి వద్ద విచారణ జరపాలని కోరారు. విచారణను 13కి వాయిదా వేశారు.
మరో ప్రక్క కలంజియమ్ రూపొందించే 'వూర్ సుట్రి పురాణం' అనే చిత్రంలో అంజలి నటించాల్సి ఉంది. అయితే షూటింగ్ కు రావట్లేదని అందుకే దక్షిణ భారత నటీనటుల సంఘంలో ఫిర్యాదు చేస్తానని దర్శకుడు మీడియాకి చెప్పారు.
కలంజియమ్ మాట్లాడుతూ ''నేను తీస్తున్న చిత్రం కథానాయిక ప్రాధాన్యం ఉన్నది. చిత్రీకరణ ప్రారంభమయ్యాక 15 రోజుల పాటు అంజలి నటించింది. కొంత భాగం చిత్రీకరణ మిగిలి ఉంది. ఇది గురువారం మొదలైంది. అయితే అంజలి పాల్గొనలేదు అన్నారు.
అలాగే అంజలి లేకుండా సినిమా పూర్తవడం అసాధ్యం. అందుకే షూటింగ్ రద్దు చేయాల్సి వచ్చింది. ఫోనులో సంప్రదించేందుకు విఫలయత్నం చేశా. ఈ సినిమా కోసం ఇప్పటికే రూ.40లక్షలు వెచ్చించాం. ఈ విషయమై ఆమెపై నటుల సంఘంలోనూ నిర్మాతల మండలి, దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేయబోతున్నాను అన్నారు.