Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నేషనల్ అవార్డుని సూపర్ స్టార్ కి అంకితం చేసిన హీరో...!
జాతీయ ఉత్తమ నటుడు అవార్డును పొందిన తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ అల్లుడు ధనుష్ తన అవార్డును మామ రజినీకాంత్ కి అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. ధనుష్ మీడియాతో మాట్లాడుతూ తనకు లభించిన ఈ అవార్డును హాస్పటల్ లో ఉన్న మామ రజినీకాంత్ త్వరగా కోలుకోవాలని, తనకి అంకితమిస్తున్నట్లు తెలిపాడు. ఈ అవార్డు వస్తుందని ఎక్స్ పెక్ట్ చేయాలేదు. చాలా ఆనందంగా వుంది. ఫస్ట్ ఈ అవారుడ్ రావడానికి కారకులైన దర్శకుడు వెట్రిమారన్ మరియు సెల్వరాఘవన్ కు నా స్పెషల్ థాక్స్ తెలుపుకొంటున్నాను అని చెప్పారు. నిన్న ప్రకటించిన వ జాతీయ ఫిలిం అవార్డులలో ఉత్తమ నటుడి విభాగంలో మలయాళ నటుడు సలీం కుమార్ తో ధనుష్ ఈ అవార్డును పంచుకున్నాడు.
తమిళ హిట్ మూవీ 'ఆడుకలం'లో నటనకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ప్రస్తుతం రజినీ కాంత్ చెన్నైలోని రామచంద్ర మెడికల్ సెంటర్ ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన త్వరగా కోలుకుని ఇంటికి వచ్చాక సెలబ్రేషన్స్ చేసుకుంటామని ధనుష్ అన్నారు.