Don't Miss!
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్నBird Flu పాలు, గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ధనుష్ ..ఇదేం పిచ్చి ఆలోచన?
చెన్నై: హిట్ సినిమాలకు సీక్వెల్స్ చేయటం కొత్తేమి కాదు..వింత అసలు కాదు. అయితే ఫ్లాఫ్ సినిమాలకు కూడా సీక్వెల్స్ చేస్తారా... చేస్తానంటోంది తమిళ సినీ పరిశ్రమ. ఆ మధ్యన ధనుష్ హీరోగా వచ్చి భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితం పొందిన ‘మారి'సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నామంటున్నారు.
బాలాజీ మోహన్ దర్శకత్వంలో ధనుష్ చెన్నై యువకుడిగా నటించిన చిత్రం ‘మారి'. రొటీన్ పాత్రలకు భిన్నంగా మాస్ కుర్రాడిగా గెటప్ను మార్చి.. ఈ సినిమాలో నటించారు ధనుష్. ఇందులో ఆయన సరసన కాజల్ నటించింది.
పావురాల పందెం కథతో రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. ఇప్పుడు ‘మారి' చిత్రానికి సీక్వెల్ను తెరకెక్కించాలని చిత్రయూనిట్ భావిస్తోంది. ఈ సారి అదిరిపోయే కథ తో వస్తున్నామంటున్నారు.
ప్రస్తుతం ధనుష్ దురైసెంధిల్ చిత్రంలో బిజీగా ఉన్నారు. ఓ హాలీవుడ్ సినిమాలోనూ నటించనున్నారు. ఇటీవల ‘మారి 2' సీక్వెల్కు కథను సిద్ధం చేశారు బాలాజీ మోహన్. అక్టోబరు నుంచి ఈ సినిమా సెట్స్పైకి వెళ్లే అవకాశముందని సంబంధిత వర్గాల సమాచారం. ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.