Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ధనుష్ ..ఇదేం పిచ్చి ఆలోచన?
చెన్నై: హిట్ సినిమాలకు సీక్వెల్స్ చేయటం కొత్తేమి కాదు..వింత అసలు కాదు. అయితే ఫ్లాఫ్ సినిమాలకు కూడా సీక్వెల్స్ చేస్తారా... చేస్తానంటోంది తమిళ సినీ పరిశ్రమ. ఆ మధ్యన ధనుష్ హీరోగా వచ్చి భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితం పొందిన ‘మారి'సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నామంటున్నారు.
బాలాజీ మోహన్ దర్శకత్వంలో ధనుష్ చెన్నై యువకుడిగా నటించిన చిత్రం ‘మారి'. రొటీన్ పాత్రలకు భిన్నంగా మాస్ కుర్రాడిగా గెటప్ను మార్చి.. ఈ సినిమాలో నటించారు ధనుష్. ఇందులో ఆయన సరసన కాజల్ నటించింది.
పావురాల పందెం కథతో రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. ఇప్పుడు ‘మారి' చిత్రానికి సీక్వెల్ను తెరకెక్కించాలని చిత్రయూనిట్ భావిస్తోంది. ఈ సారి అదిరిపోయే కథ తో వస్తున్నామంటున్నారు.
ప్రస్తుతం ధనుష్ దురైసెంధిల్ చిత్రంలో బిజీగా ఉన్నారు. ఓ హాలీవుడ్ సినిమాలోనూ నటించనున్నారు. ఇటీవల ‘మారి 2' సీక్వెల్కు కథను సిద్ధం చేశారు బాలాజీ మోహన్. అక్టోబరు నుంచి ఈ సినిమా సెట్స్పైకి వెళ్లే అవకాశముందని సంబంధిత వర్గాల సమాచారం. ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.