Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ధనుష్ ..ఇదేం పిచ్చి ఆలోచన?
చెన్నై: హిట్ సినిమాలకు సీక్వెల్స్ చేయటం కొత్తేమి కాదు..వింత అసలు కాదు. అయితే ఫ్లాఫ్ సినిమాలకు కూడా సీక్వెల్స్ చేస్తారా... చేస్తానంటోంది తమిళ సినీ పరిశ్రమ. ఆ మధ్యన ధనుష్ హీరోగా వచ్చి భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితం పొందిన ‘మారి'సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నామంటున్నారు.
బాలాజీ మోహన్ దర్శకత్వంలో ధనుష్ చెన్నై యువకుడిగా నటించిన చిత్రం ‘మారి'. రొటీన్ పాత్రలకు భిన్నంగా మాస్ కుర్రాడిగా గెటప్ను మార్చి.. ఈ సినిమాలో నటించారు ధనుష్. ఇందులో ఆయన సరసన కాజల్ నటించింది.
పావురాల పందెం కథతో రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. ఇప్పుడు ‘మారి' చిత్రానికి సీక్వెల్ను తెరకెక్కించాలని చిత్రయూనిట్ భావిస్తోంది. ఈ సారి అదిరిపోయే కథ తో వస్తున్నామంటున్నారు.
ప్రస్తుతం ధనుష్ దురైసెంధిల్ చిత్రంలో బిజీగా ఉన్నారు. ఓ హాలీవుడ్ సినిమాలోనూ నటించనున్నారు. ఇటీవల ‘మారి 2' సీక్వెల్కు కథను సిద్ధం చేశారు బాలాజీ మోహన్. అక్టోబరు నుంచి ఈ సినిమా సెట్స్పైకి వెళ్లే అవకాశముందని సంబంధిత వర్గాల సమాచారం. ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.