Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
శంకర్ తదుపరి చిత్రం ఖరారు..హీరో ఎవరంటే.. ?
అయితే శంకర్ ఇప్పటికే కొత్త చిత్రానికి రంగం సిద్ధం చేసుకొన్నారని తెలిసింది. శంకర్ దర్శకత్వంలో యువ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్ నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది. ఆగస్టు నుంచి ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. పూర్తి వివరాలు కొద్ది వారాల్లో వెల్లడవుతాయి.
విక్రమ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తన రేంజికి తగిన విధంగా భారీ లొకేషన్లలో చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈచిత్రం తొలి షెడ్యూల్ చెన్నయ్ ప్రాంతంలో చిత్రీకరించారు. సినిమా గ్రాండ్గా రావడానికి బెస్ట్ లొకేషన్లు ఎంపిక చేసుకున్నాడు. గతంలో శంకర్ నిర్మించిన 'జీన్స్' చిత్రంలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతో పాటు పలు ప్రపంచ ప్రసిద్ధ లొకేషన్లు చూపించారు. తాజాగా ఐ చిత్రం కూడా వరల్డ్ బెస్ట్ ప్లేసెస్లో చిత్రీకరణ జరుపి ప్రేక్షకులకు కనువిందు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
అమీ జాక్స్ను ఈచిత్రంలో విక్రమ్ సరసన హీరోయిన్ నటిస్తోంది. ఈ చిత్రానికి పి.సి. శ్రీరామ్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'హారీపొటర్' చిత్రానికి పనిచేసిన ఆస్ట్రేలియన్ కంపెనీ స్పెషల్ ఎఫెక్ట్స్ని అందించనుంది.
'మెన్ ఇన్ బ్లాక్' చిత్రానికి పనిచేసిన మారీ ఓగ్ట్ ఈ చిత్రానికి కాస్టూమ్స్ డిజైనర్గా సేవలందించనున్నాడు. చైనాకు చెందిన ఫైట్మాస్టర్ పీటర్ మింగ్ ఈ చిత్రానికి పోరాట దృశ్యాలని సమకూర్చనున్నాడు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో శంకర్, విక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అపరిచితుడు చిత్రం కమర్షియల్గా సూపర్హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.