Don't Miss!
- News వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
కలర్స్ స్వాతి హిట్ సినిమా ఇప్పుడు నవలగా...
చెన్నై : 1960లలోని ప్రేమకావ్యం 'సుబ్రమణ్యపురం'(తెలుగులో అనంతపరుం) గా తెరకెక్కి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. శశికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జై, స్వాతి జంటగా నటించారు. శశికుమార్, సముద్రకని ముఖ్య పాత్రలు పోషించారు. భిన్నమైన కథాంశంతో.. ఊహకు అందని ముగింపుతో అందరి గుండెలను పిండేసిన ఈ చిత్రం గత ఏడాది తమిళ నవలగానూ అక్షరరూపం దాల్చింది.
ఇప్పుడు ఆ నవలను ఆంగ్లంలోనూ తీసుకొచ్చారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో దర్శకుడు గౌతంమీనన్ దీనిని ఆవిష్కరించారు. సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఎస్.వెంకటేశన్ అందుకున్నారు. దర్శకనిర్మాత సముద్రకని, సంగీత దర్శకుడు జేమ్స్ వసంతన్ తదితరులు పాల్గొన్నారు.
1980 సంవత్సరంలో జరిగిన సంఘటనలే ఈ చిత్ర కథ. నాటి వాతావరణాన్నీ, జీవన శైలినీ ప్రతిబింబిస్తుంది. అప్పటి యువకుల కేశాలంకరణలు, దుస్తుల్లో ఫ్యాషన్స్, అప్పటి సంగీతం...అన్నీ తెర మీద కనిపిస్తాయి. సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. ప్రేమ, పగ, స్నేహం అనే అంశాల చుట్టూ తిరుగుతుందీ చిత్రం . ఇక ఈ చిత్రానికి శశికుమార్ దర్శకుడు. మిగతా పాత్రల్లో జై, సముద్రకన్ని, గంజా కరుప్పు చేసారు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ మాత్రం అంతంత మాత్రం ఆడింది.