Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
మణిరత్నంకు నాలుగోసారి గుండెపోటు.. హాస్పిటల్కు తరలింపు
Recommended Video
ప్రముఖ దర్శకుడు మణిరత్నం తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరారు. ఆయనకు గుండెపోటు రావడంతో చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్తితి నిలకడగా ఉన్నట్టు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మణిరత్నంకు గుండెపోటు రావడం ఇది నాలుగోసారి. అయితే కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ వార్తపై స్పందించారు. వివరాల్లోకి వెళితే..
2004లో తొలిసారి
మణిరత్నంకు తొలిసారి 2004లో యువ సినిమా షూటింగ్లో వచ్చింది. సెట్లోని ఛాతిలో నొప్పి రాగా, వెంటనే హాస్పిటల్కు తరలించడంతో ప్రాణాప్రాయం తప్పింది. ఆ తర్వాత దశాబ్దకాలం అనంతరం 2015లో ఒకే బంగారం సినిమా షూట్ సందర్భంగా రెండోసారి కశ్మీర్లో గుండెపోటుకు గురయ్యారు. కశ్మీర్ నుంచి వెంటనే ఢిల్లీకి తరలించి చికిత్సను అందించడంతో ఆయన కోలుకొన్నారు.
2018లో మూడోసారి
2015 తర్వాత ఆరోగ్యంగా కనిపించినప్పటికీ 2018లో మళ్లీ గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చేరినట్టు వార్తలు వచ్చాయి. అయితే కుటుంబ సభ్యులు ఆ వార్తను ఖండించారు. రోటీన్ చెకప్ కోసమే ఆయన హాస్పిటల్కు వెళ్లారని మీడియాకు వివరణ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా నాలుగోసారి గుండెపోటుకు గురయ్యారు. ఈ విషయాన్ని మణిరత్నం పీఆర్ వర్గాలు క్లారిటీ ఇచ్చారు.
తాజాగా గుండెపోటుపై వివరణ
దర్శకుడు మణిరత్నంకు హృదయ సంబంధిత సమస్యలు తలెత్తాయి. ఆయనను చెన్నైలోని గ్రీమ్స్ రోడ్లోని అపోలో హాస్పిటల్లో చేర్పించాం. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతున్నది. మరింత సమాచారం వైద్యులు వెల్లడింంచే బులెటిన్ బట్టి మేము వివరాలు అందజేస్తాం అని లోకేష్ జేయ్ తెలిపారు.
పొన్నియన్ సెల్వన్ మూవీతో
ప్రస్తుతం మణిరత్నం పొన్నియన్ సెల్వన్ అనే చారిత్రాత్మక చిత్రంపై పనిచేస్తున్నారు. బాహుబలి రేంజ్లో తెరకెక్కించే ఈ చిత్రంలో భారీ రేంజ్లో అగ్రనటులను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే ఐశ్వర్య రాయ్ బచ్చన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నది. మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.