Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత ముక్తా శ్రీనివాసన్ కన్నుమూత
ప్రఖ్యాత తమిళ దర్శకుడు, నిర్మాత ముక్తా శ్రీనివాసన్(88) ఇక లేరు. మంగళవారం రాత్రి చెన్నైలో అనారోగ్యంతో కన్నుమూశారు. 1957లో వచ్చిన 'ముదలాలి' అనే సినిమా ద్వారా ఆయన దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టారు. ఎస్ఎస్ రాజేంద్రన్ హీరోగా నటించిన ఈ చిత్రం బెస్ట్ తమిళ ఫీచర్ ఫిల్మ్గా జాతీయ అవార్డు దక్కించుకుంది.
ఆరు దశాబ్దాలకుపైగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగిన సాగిన శ్రీనివాసన్ దాదాపు 67 చిత్రాలు రూపొందించారు. అందులో పాంచాలి, నినైవిల్ నిండ్రవన్, సూర్యగాంధీ, సిమ్లా స్పెషల్, పొల్లదావన్ లాంటి ఎన్నో మొమోరబుల్ చిత్రాలు ఉన్నాయి. శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత లాంటి ప్రముఖులతో కలిసి పని చేశారు.
శ్రీనివాసన్ నిర్మించిన 'నాయగన్' మొట్టమొదటి సారిగా ఆస్కార్కు నామినేట్ అయిన భారతీయ చిత్రంగా గుర్తింపు పొందింది. బాలచందర్, మణిరత్నం వంటి ప్రముఖ దర్శకులు ఆయన వద్ద శిష్యరికం చేసినవారే కావడం విశేషం.
నిర్మాతగా, దివంగత ముఖ్యమంత్రి కామరాజర్కు సన్నిహితుడిగా, జీకే మూపనార్కు మిత్రుడిగా ఆయనకు పేరుంది. శ్రీనివాసన్ మరణంపట్ల పలువురు తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.