Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత ముక్తా శ్రీనివాసన్ కన్నుమూత
ప్రఖ్యాత తమిళ దర్శకుడు, నిర్మాత ముక్తా శ్రీనివాసన్(88) ఇక లేరు. మంగళవారం రాత్రి చెన్నైలో అనారోగ్యంతో కన్నుమూశారు. 1957లో వచ్చిన 'ముదలాలి' అనే సినిమా ద్వారా ఆయన దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టారు. ఎస్ఎస్ రాజేంద్రన్ హీరోగా నటించిన ఈ చిత్రం బెస్ట్ తమిళ ఫీచర్ ఫిల్మ్గా జాతీయ అవార్డు దక్కించుకుంది.
ఆరు దశాబ్దాలకుపైగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగిన సాగిన శ్రీనివాసన్ దాదాపు 67 చిత్రాలు రూపొందించారు. అందులో పాంచాలి, నినైవిల్ నిండ్రవన్, సూర్యగాంధీ, సిమ్లా స్పెషల్, పొల్లదావన్ లాంటి ఎన్నో మొమోరబుల్ చిత్రాలు ఉన్నాయి. శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత లాంటి ప్రముఖులతో కలిసి పని చేశారు.
శ్రీనివాసన్ నిర్మించిన 'నాయగన్' మొట్టమొదటి సారిగా ఆస్కార్కు నామినేట్ అయిన భారతీయ చిత్రంగా గుర్తింపు పొందింది. బాలచందర్, మణిరత్నం వంటి ప్రముఖ దర్శకులు ఆయన వద్ద శిష్యరికం చేసినవారే కావడం విశేషం.
నిర్మాతగా, దివంగత ముఖ్యమంత్రి కామరాజర్కు సన్నిహితుడిగా, జీకే మూపనార్కు మిత్రుడిగా ఆయనకు పేరుంది. శ్రీనివాసన్ మరణంపట్ల పలువురు తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.