Don't Miss!
- News కవిత అరెస్ట్ పై ఇంతకాలానికి కేసీఆర్ స్పందన వెనుక బిగ్ రీజన్
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
టీవీ యాంకర్ ని పెళ్లాడిన డైరక్టర్, నాగ్ సినిమాకు పనిచేసాడు
చెన్నై: రెండు రోజుల క్రితం నాగార్జున హీరోగా వచ్చిన 'మనం' దర్శకుడు విక్రమ్ కుమార్ వివాహం గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. తను ప్రేమించిన అమ్మాయిని విక్రమ్ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు మరో డైరక్టర్ ఓ ఇంటివాడయ్యాడు. అయితే ఈ వివాహానికి నాగార్జునకు కూడా లింక్ ఉంది.
రీసెంట్ గా జోకర్ టైటిల్ తో తమిళంలో హిట్ కొట్టిన దర్శకుడు రాజు మురుగన్, టీవీ యాంకర్ హేమా సిన్హాలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. 'కుక్కూ' చిత్రం ద్వారా కోలీవుడ్కు దర్శకుడు రాజు మురుగన్ పరిచయమయ్యారు. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన 'జోకర్' భారీ విజయాన్ని సాధించింది.
అంతకు ముందు కార్తి, నాగార్జున నటించిన 'తోళా'(ఊపిరి) చిత్రానికి మాటలు కూడా సమకూర్చారు. తన చిన్ననాటి స్నేహితురాలు, ఓ టీవీ ఛానెల్ వ్యాఖ్యాత హేమను ప్రేమించి, ఇరు కుటుంబాల సమ్మతితో పెళ్లి చేసుకున్నారు.
దర్శకుడు బాలా సమక్షంలో వీరి వివాహం చెన్నై, బిసెంట్ నగర్లోని సుబ్రమణ్యస్వామి ఆలయంలో నిరాడంబరంగా జరిగింది. ప్రముఖ రచయిత మనుష్యపుత్రన్, పాటల రచయిత యుగభారతి తదితరులు పాల్గొన్నారు.
తమిళంలో పొలిటికల్ సెటైరికల్ ఫిల్మ్ గా తెరకెక్కిన చిత్రం జోకర్. రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గురు సోమసుందరం, గాయత్రి కృష్ణ, రమ్య పాండియన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన సినిమా మంచి హిట్టైంది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించింది.