Don't Miss!
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
400 కోట్లతో సంఘమిత్ర.. షూటింగ్ డేట్ కన్ఫర్మ్..
బాహుబలి స్ఫూర్తితో దక్షిణాదిలో భారీ చిత్రాల నిర్మాణం ఊపందుకొన్నది. ఇప్పటికే భారీ బడ్జెట్తోపాటు, అత్యాధునిక సాంకేతికతో రోబో2 చిత్రం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్నది. ఒకవైపు రోబో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కు సిద్ధవుతుండగా, మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు సిద్దమవుతున్నది. తమిళ చిత్ర పరిశ్రమలో కనివిని ఎరుగని విధంగా సంఘమిత్ర చిత్రాన్ని రూ.400 కోట్లతో తెరకెక్కించనున్నారు.
సంఘమిత్ర చిత్రాన్ని తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో దర్శకుడు సుందర్ సీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తొలుత శృతిహాసన్ను హీరోయిన్గా ఎంపిక చేశారు. కొన్ని కారణాల వల్ల శృతి సినిమాను అర్ధాంతరంగా తప్పుకొన్నారు. ఆ తర్వాత శృతీ స్థానంలో బాలీవుడ్ నటి దిశా పటానిని ప్రాజెక్ట్లోకి తీసుకొన్నారు.
సంఘమిత్ర మూవీ షూటింగ్ హైదరాబాద్లోని ప్రతిష్ఠాత్మక రామోజీ ఫిల్మ్ సిటీలో జూలై నుంచి ప్రారంభం కానున్నదనేది తాజా సమాచారం. ఈ చిత్రం కోసం రామోజీ స్టూడియోలో భారీ సెట్స్ను వేస్తున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.