twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనూష్కని కుక్క కరిచింది

    By Srikanya
    |

    చెన్నై : కంటిన్యూగా తమిళ,తెలుగు చిత్రాల షూటింగ్ లలో బిజీగా ఉన్న అనూష్కకు రెస్ట్ తీసువాల్సిన పరిస్దితి వచ్చింది. రీసెంట్ గా ఓ పార్టీకి వెళ్లిన ఆమెను ఓ కుక్క కరిచింది. ఆ పార్టీకి వచ్చిన ఒకరి పెంపుడు కుక్క అనూష్కని కలిచినట్లు సమాచారం. దాంతో వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసారు. తర్వాత డాక్టర్ ఆమెను కొద్ది రోజులు పాటు రెస్ట్ తీసుకోమని చెప్పారు. పరిశ్రమలోని ఆమె శ్రేయాభిలాషులు ఆమెను ఈ విషయమై కలిసి పలకరించారు. ప్రస్తుతం ఆర్.ఆర్. మూవీ మేకర్స్ నిర్మిస్తున్న నాగార్జున తాజా చిత్రం 'ఢమరుకం'లోను 'అలెక్స్‌ పాండియన్‌'లో కార్తీ, 'తాండవం'లో విక్రంతోనూ నటిస్తోంది.

    విక్రమ్‌, జగపతిబాబు హీరోలుగా తేజ సినిమా పతాకాన విజయ్‌ దర్శ కత్వంలో సి.కళ్యాణ్‌ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రం 'శివ తాండవం'. ఈ చిత్రంలో విక్రమ్ ఓ ఢిఫరెంట్ పాత్రలో రా ఆఫీసర్ గా కనిపించనున్నారు. అలాగే ఈ పాత్రకు ఉన్న మరో ప్రత్యేకత అంధుడిగా విక్రమ్ కనిపించటం. ఇక ఈ చిత్రం మరో ప్రత్యేకత ఏమిటీ అంటే..అనూష్క. ఆమె చిత్రం ప్లాష్ బ్యాక్ లో కనపడనుందని తెలుస్తోంది. ఇక మరో హీరోయిన్ గా చేస్తున్న అమీ జాక్సన్ పాత్ర హైలెట్ కానుంది. ఆమె కి సంభందించిన సీన్స్ మొత్తం యు.ఎస్ లో చిత్రీకరించారు. అనూష్క ఎపిసోడ్ మొత్తం ఇండియాలో సాగుతుంది. చిత్రం కథ ఈ రెండు దేశాల్లో సాగుతుంది.

    అలాగే అనూష్క ప్రస్తుతం తమిళంలో చేస్తున్న చిత్రం బృందావనంలో నందకుమారుడు అనే టైటిల్ తో రిలీజ్ అవుతోంది. అనూష్క,ఆర్య కాంబినేషన్ లో సెల్వ రాఘవన్ డైరక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఇరాండం ఉలగం టైటిల్ తో ఈ చిత్రం తమిళంలో విడుదల కానుంది. ఇందులోని ఓ పాత్ర కోసం అనూష్క రీసెంట్ గా మార్షిల్ ఆర్ట్స్ సైతం నేర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో రాధిక ఓ కీలకపాత్రను పోషిస్తోంది. తమిళంలో ఈ చిత్రాన్ని యూ.టీవి మోషన్ పిక్చర్స్ వారు సమర్పిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని ప్రసాద్ .వి.పొట్లూరి అందిస్తున్నారు. ఇందులో అనూష్క ద్విపాత్రాభినయం చేస్తోంది. ఓ రేంజిలో ఈ చిత్రం అద్బుతంగా రూపొందుతోందని చెన్నై వర్గాల టాక్.

    మరో ప్రక్క ఆమె నటించిన ఢమురకం చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. నాగార్జున హీరోగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'డమరుకం'. నాగార్జున అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఆడియో ఈ మధ్యనే విడుదలైంది. ఢమురుకం చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. ఇక అనూష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు.

    English summary
    Anushka Shetty did not bother to take a break even after a grueling schedule of 'Irandam Ulagam' in Georgia. Instead, she took part in the shootings of her upcoming films, including 'Alex Pandian'. But fate had different plans it seems, as the actress is forced to take rest, after a dog bit her at a recent party. "It was a pet dog of one of the invitees of the party. When Anushka saw the canine taking in a tissue paper, she attempted to take it out. But unfortunately, the dog bit her," sources said.
 Dog bites actress Anushka Shetty. Anushka was immediately given first aid and. It is learnt that she has been advised by the doctors to be on rest for few days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X