Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పోలీస్ ఆఫీసర్ భార్య పై కన్నేసిన ‘మద మృగం’
కిషోర్, శశి, లీనా, స్వాతి ప్రధాన పాత్రల్లో సమీర్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన 'ద్రోహం' చిన్న చిత్రాల్లో గొప్ప కలెక్షన్స్ సాధించిన చిత్రంగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణో ఫిలిమ్స్ పతాకంపై 'మదమృగం' పేరుతొ నిర్మాత సి.హెచ్. సీతారామిరెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత సి.హెచ్. సీతారామిరెడ్డి మాట్లాడుతూ 'విభిన్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రం మొదటి వారంలోనే 3 కోట్లు కలెక్ట్ చేసి చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన చిత్రంగా మంచి పేరు తెచ్చుకుంది. చూసిన ప్రతిది తన సొంతం అయిపోవాలనుకునే ఓ జమిందారు కొడుకు కధ ఇది. ఒక రోజు ఓ పోలిస్ ఆఫీసర్ భార్య అతని కంట్లో పడుతుంది. ఆమెను ఎలాగైనా అనుభవించాలనుకుంటాడు. దాని కోసం ఒక పధకం వేసి ఆమె ఇంటికి వెళ్ళి ఆమెను వెనుక నుంచి కౌగిలించుకుంటాడు. అదే టైం లో ఫోటో తీసేలా ప్లాన్ చేసి ఆ ఫోటోతో ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు.
అతను సైకో కాదు, హంతకుడు కాదు కాని ఒక డిఫరెంట్ మెంటాలిటీతో అందర్నీ హడలెత్తిస్తుంటాడు. అయితే చివరికి ఏం జరిగింది. అతని ఆగడాలను ఎలా అరికట్టారు అన్నది కధాంశం. డైరెక్టర్ సమీర్ ఈ సబ్జెక్ట్ ను ఎంతో అద్భుతంగా హ్యాండిల్ చేసారు. ఆడియన్స్ కు ఎక్కడా బోర్ అనేది కలగకుండా ప్రతి సీన్ ను ఎంతో అందంగా తీశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో వున్నాయి.
సెప్టెంబర్ ద్వితీయార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. చక్కని కధ, కధనాలతో సాగే ఈ చిత్రం తెలుగులోను మంచి విజయం సాధించి మాకు మా బేనర్ కు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాం' అన్నారు. కిషోర్, శశి, లీనా, స్వాతి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు- వెంకట్, సంగీతం- మనిష, నిర్మాత సి.హెచ్. సీతారామిరెడ్డి, కథ స్ర్కీన్-ప్లే దర్శకత్వం- సమీర్.