Don't Miss!
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పోలీస్ ఆఫీసర్ భార్య పై కన్నేసిన ‘మద మృగం’
కిషోర్, శశి, లీనా, స్వాతి ప్రధాన పాత్రల్లో సమీర్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన 'ద్రోహం' చిన్న చిత్రాల్లో గొప్ప కలెక్షన్స్ సాధించిన చిత్రంగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణో ఫిలిమ్స్ పతాకంపై 'మదమృగం' పేరుతొ నిర్మాత సి.హెచ్. సీతారామిరెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత సి.హెచ్. సీతారామిరెడ్డి మాట్లాడుతూ 'విభిన్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రం మొదటి వారంలోనే 3 కోట్లు కలెక్ట్ చేసి చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన చిత్రంగా మంచి పేరు తెచ్చుకుంది. చూసిన ప్రతిది తన సొంతం అయిపోవాలనుకునే ఓ జమిందారు కొడుకు కధ ఇది. ఒక రోజు ఓ పోలిస్ ఆఫీసర్ భార్య అతని కంట్లో పడుతుంది. ఆమెను ఎలాగైనా అనుభవించాలనుకుంటాడు. దాని కోసం ఒక పధకం వేసి ఆమె ఇంటికి వెళ్ళి ఆమెను వెనుక నుంచి కౌగిలించుకుంటాడు. అదే టైం లో ఫోటో తీసేలా ప్లాన్ చేసి ఆ ఫోటోతో ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు.
అతను సైకో కాదు, హంతకుడు కాదు కాని ఒక డిఫరెంట్ మెంటాలిటీతో అందర్నీ హడలెత్తిస్తుంటాడు. అయితే చివరికి ఏం జరిగింది. అతని ఆగడాలను ఎలా అరికట్టారు అన్నది కధాంశం. డైరెక్టర్ సమీర్ ఈ సబ్జెక్ట్ ను ఎంతో అద్భుతంగా హ్యాండిల్ చేసారు. ఆడియన్స్ కు ఎక్కడా బోర్ అనేది కలగకుండా ప్రతి సీన్ ను ఎంతో అందంగా తీశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో వున్నాయి.
సెప్టెంబర్ ద్వితీయార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. చక్కని కధ, కధనాలతో సాగే ఈ చిత్రం తెలుగులోను మంచి విజయం సాధించి మాకు మా బేనర్ కు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాం' అన్నారు. కిషోర్, శశి, లీనా, స్వాతి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు- వెంకట్, సంగీతం- మనిష, నిర్మాత సి.హెచ్. సీతారామిరెడ్డి, కథ స్ర్కీన్-ప్లే దర్శకత్వం- సమీర్.