Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాపు చిత్రాల ఎడిటర్ కన్నుమూత
చెన్నై : తెలుగు, తమిళ భాషా చిత్రాలకు ఎడిటర్గా పనిచేసిన కె.ఎన్.రాజు (65) చెన్నైలో కన్నుమూశారు. తమిళనాడులోని పాళయంకోట్టైలో జన్మించిన ఆయన పూర్తిపేరు కె.నరసింహరాజు. తెలుగులో జాతర, రామాయణంలో సీత, కలలు కనే కళ్లు తదితర చిత్రాలకు పనిచేశారు. దర్శకుడు బాపూతో సన్నిహిత సంబంధాలుండటంతో ఆయన దర్శకత్వంలోని మిస్టర్ పెళ్లాం, రాంబంటు, పెళ్లికొడుకు, రాధాగోపాళం చిత్రాలకు రాజు పనిచేశారు.
గుండెపోటుతో మంగళవారం రాత్రి చెన్నై టీనగర్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. చెన్నై దూరదర్శన్లో 1975 నుంచి 2012వ ఏడాది వరకు చీఫ్ ఎడిటర్, ఎడిట్ సూపర్వైజర్ హోదాల్లో పనిచేశారు. సెల్వ దర్శకత్వంలో తమిళంలో అమరావతి, ఎళావదు మనిదన్, శిష్యా, తలైవాసల్ సినిమాలకు కూడా పనిచేశారు.
ఆయన ప్రముఖ రచయిత రాజశ్రీకి అల్లుడు కాగా రాజు సతీమణి లక్ష్మి తెలుగు చిత్రపరిశ్రమలో మాటల రచయిత. కె.ఎన్.రాజు మృతి చెందారనే వార్త తెలిసిన వెంటనే ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఘంటసాల రత్నకుమార్, సినిమాటోగ్రాఫర్ సిద్ధార్థ్ తదితరులు ఆయన నివాసానికి చేరుకున్నారు.
రాజు భౌతికకాయానికి నివాళులర్పించి ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. అమెరికాలో ఉన్న రాజు కుమార్తె ఆర్తి పవన్కుమార్ చెన్నైకు బయలుదేరారని, గురువారం మధ్యాహ్నం కన్నమ్మపేటలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.