twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రిషకు ఏదో జరిగిపోయింది.. ఆసుపత్రిలో చికిత్స.. నమ్మవద్దు అంటూ తల్లి వివరణ!

    |

    క్రేజీ హీరోయిన్ త్రిష సైలెంట్ గా తన పని తాను చేసుకుపోయే రకం కాదు. తరచుగా ఏదో ఒక అంశంతో త్రిష వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. గతంలో త్రిష టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. వర్షం, అతడు లాంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యువత కూడా త్రిషకు ఫిదా అయ్యారు. త్రిష చాలా కాలం పాటు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ప్రస్తుతం టాలీవుడ్ లో త్రిష హవా బాగా తగ్గింది. తమిళంలో మాత్రం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. తాజాగా త్రిష గురించి వైరల్ అవుతున్న ఓ వార్త అభిమానులని కలవరపెడుతోంది.

    'రాంగి' షూటింగ్‌లో

    'రాంగి' షూటింగ్‌లో

    త్రిష ప్రస్తుతం రాంగి అనే చిత్రంలో శరవణన్ దర్శకత్వంలో నటిస్తోంది. ఇటీవల త్రిష రాంగి షూటింగ్ లో పాల్గొంటుండగా సడెన్ గా కళ్ళుతిరిగి పడిపోయిందట. దీనితో కంగారు పడిపోయిన చిత్ర యూనిట్ ఆమెని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు వార్తలు వచ్చాయి. త్రిషకు వైద్యులు చికిత్స చేస్తున్నారని ప్రచారం మొదలైంది. కానీ త్రిష ఎందుకు అలా పడిపోయింది.. ఆమెకు ఏమైంది లాంటి ప్రశ్నలకు మాత్రం సమాధానాలు దొరకడం లేదు.

     వదంతులు నమ్మొద్దు

    వదంతులు నమ్మొద్దు

    త్రిష ఆరోగ్యం గురించి వదంతులు ఎక్కువవుతుండడంతో ఆమె తల్లి ఉమా కృష్ణన్ స్పందించారు. త్రిష గురించి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. త్రిష ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉంది. రాంగి షూటింగ్ కూడా నిర్విరామంగా జరుగుతోంది. అభిమానులు ఎవరూ ఇలాంటి వదంతులని నమ్మొద్దు అని ఉమా కృష్ణన్ అన్నారు. ఊహించని విధంగా అభిమానుల్లో త్రిష గురించి ఆందోళన పెరిగిపోతుండడంతో ఉమా కృష్ణన్ స్పందించి వివరణ ఇచ్చారు.

     లేడి ఓరియెంటెడ్ చిత్రాలు

    లేడి ఓరియెంటెడ్ చిత్రాలు

    ఇదిలా ఉండగా ప్రస్తుతం త్రిషకు తమిళంలో అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. చాలా మంది దర్శకులు త్రిషతో లేడీ ఓరియేంటేడ్ చిత్రం తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నారు. త్వరలో త్రిష స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కథ అందించే చిత్రంలో నటించనుంది. ఈ చిత్రంలో త్రిష ప్రధాన పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం నయనతార, అనుష్క లాంటి స్టార్ హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకుపోతున్నారు.

    96తో సంచలనం

    96తో సంచలనం

    త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన 96 చిత్రం గత ఏడాది సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. త్రిష చివరగా నటించిన చిత్రం పేట. సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన త్రిష తొలిసారి జంటగా నటించింది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన పేట మంచి వసూళ్లనే రాబట్టింది.

    English summary
    Fake news on Trisha's health goes viral in social media. Trisha's Mother Umakrishnan gives clarity and says Trisha is absolutely fine
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X