Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
రజనీతో సెల్ఫీ.. ఇక ప్రశాంతంగా చనిపోయినా ఫర్వాలేదు
ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్ రజనీకాంత్కు ఎంత పాపులారిటీ, స్టార్డమ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రజనీని దగ్గరగా చూడాలని, వీలైతే చేయి తాకాలని, లేదంటే ఓ ఫోటో దిగాలని కోట్లాది మంది అభిమానులు కోరుకొంటారు. అలాంటి కోట్లాది అభిమానుల్లో ఒకరైన లక్ష్మణ్కు సెల్ఫీ దిగే అవకాశం లభించింది. ఆ తర్వాత ఆ కుర్రాడు పరిస్థితి ఎలా ఉందో మీరే ఊహించుకోండి... వివరాల్లోకి వెళితే
రజనీనివెంటాడిన అభిమాని
మద్రాస్ ఎయిర్పోర్టు నుంచి ట్యుటికారిన్కు వెళ్లడానికి రజనీకాంత్ బయలుదేరాడు. కారులో ఎయిర్పోర్టుకు వస్తున్న సమయంలో లక్ష్మణ్ అనే అభిమాని చూసి వెంబడించాడు. ఆ సమయంలో అభిమానిని గమనించిన రజనీ కారును ఆపమని డ్రైవర్కు సూచించారు. కారు ఆగిన వెంటనే అభిమాని దగ్గరికి పిలిచి మాట్లాడారు.
అభిమానితో రజనీ సెల్ఫీ
తన అభిమాన నటుడిని చూసిన లక్ష్మణ్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. సెల్ఫీ దిగుతానని రజనీకాంత్ను వినమ్రంగా అడిగారు. అభిమాని కోరికను మన్నించి వెంటనే రజనీ సెల్పీ దిగారు. రజనీతో సెల్ఫీ దిగి ఆనందంతో తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసుకొన్నాడు.
ఇక చనిపోయినా ఫర్వాలేదు
సూపర్స్టార్ రజనీకాంత్తో సెల్పీ దిగాను. ఇప్పుడు నేను ప్రశాంతంగా చనిపోయిన ఫర్వాలేదు అని లక్ష్మణ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. రజనీ అంటే అభిమానులకు ఎంత ఇష్టమో అని వెల్లడించడానికి ఈ ఉదంతం చాలూ అని చెప్పవచ్చు.
జూన్ 7న కాలా చిత్రం
రజనీకాంత్ నటించిన కాలా చిత్రం జూన్ 7వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రాన్ని వండర్బార్, లైకా ప్రొడక్షన్ బ్యానర్లో హీరో ధనుష్ నిర్మించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు హ్యుమా ఖురేషి, నానా పాటేకర్ నటించారు. కబాలి తర్వాత పా రంజిత్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో సంపత్, షియాజి షిండే, సముద్రఖని కీలక పాత్రలను పోషించారు. అలాగే రూ.400 కోట్ల వ్యయంతో శంకర్ దర్శకత్వంలో రూపొందించిన 2.0 చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.