Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అభిమానం పేరుతో రజనీ ఫ్యాన్స్ అలా చేయడం కుదరదు!
బెంగుళూరు: అభిమానం ఉండొచ్చు...వీరాభిమానం ఉండొచ్చు... కానీ అభిమానం పేరుతో అనవసర వృధా చేయడం ఎంత వరకు సబబు? తమ అభిమాన హీరో సినిమాలు విడుదలైనపుడు అభిమానులు సంబరాలు జరుపుకోడం, పెద్ద పెద్ద బేనర్లు, కటౌట్లు ఏర్పాటు చేయడంతో పాటు పాలాభిషేకాలు కూడా చేస్తుంటారు.
సౌత్లో ఈ రకంగా అతిగా హడావుడి చేసే వారిలో ముందుండేది రజనీకాంత్ అభిమానులే. రజనీకాంత్ సినిమా విడుదల అవుతుందంటే....కటౌట్లకు, పోస్టర్లకు అభిషేకం పేరుతో సౌతిండియా వ్యాప్తంగా వేలాది లీటర్ల పాలు నేలపాలు చేస్తున్నారు అభిమానులు. ఇకపై అభిమానులు ఇలా పాలాభిషేకం చేయడం కుదరదేమో!
రజనీకాంత్ అభిమానులు చేస్తున్న పాల వృధాపై ఒక బెంగుళూరులోని కోర్టులో ఇంజక్షన్ సూట్ దాఖలైంది. ఆయన సినిమా విడుదల సందర్భంగా పోస్టర్లను అభిషేకించడానికి వేల లీటర్ల పాలను వృథా చేస్తున్నారని, అలా చేయకుండా రజనీకాంత్కి, ఆయన అభిమానులకి ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
26న దాఖలైన ఈ కేసుపై కోర్టు రజనీకాంత్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 11కు వాయిదా వేసింది. మరి దీనిపై రజనీకాంత్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ విషయమై రజనీకాంత్ పాజిటివ్ గా స్పందిస్తే బావుంటుందని పలువురు భావిస్తున్నారు. పాలాభిషేకం చేసే బదులు అవే పాలను రోగులకు, పేదల పిల్లలకు దానం చేసేలా రజనీకాంత్ అభిమానులకు సూచిస్తే బావుంటుందని అంటున్నారు.