Don't Miss!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నీచంగా ప్రవర్తించి.. ఈ హీరో పేరు చెప్పారు.. ఇంతకీ ఎవరి ఫ్యాన్స్?
హీరోలు హీరోలు బాగానే ఉంటారు.. అభిమానులే పంతాలకు, పౌరుషాలకు పోయి తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు దేశంలో ఇతర సినీ ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగు, తమిళ రాష్ట్రాల్లో కాస్త ఎక్కువే. ఈ మధ్య ప్రత్యర్థి హీరోల అభిమానులకు చెడ్డపేరు తేవడానికి కొందరు పని కట్టుకని తప్పుడు పనులు చేస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన తమిళనాడులో జరిగింది. అజిత్ నటించిన విశ్వాసం తమిళంలో విడుదలై 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ షోలు వేశారు. అయితే ఈ షోకు అజిత్ అభిమానుల ముసుగులో బయటి వారు వచ్చి థియేటర్లో విధ్వంసానికి పాల్పడ్డట్లు సమాచారం.
అజిత్ అభిమానుల ముసుగులో విధ్వంసం
చెన్నైలోని లీడింగ్ థియేటర్లలో ఒకటైన రోహిణి సిల్వర్ స్క్రీన్స్లో ‘విశ్వాసం' 50 రోజులు పూర్తయిన సందర్భంగా స్పెషల్ షో వేశారు. షో పూర్తయిన తర్వాత కొందరు దుండగులు తాము అజిత్ అభిమానులమని చెప్పుకుంటూ థియేటర్లో విధ్వంసానికి పాల్పడ్డారు. స్క్రీన్ డ్యామేజ్ చేశారు.
అభిమానులందరికీ చెడ్డపేరు
ఈ విషయాన్ని రోహిణి సిల్వర్ స్క్రీన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రేవంత్ చరణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొందరు అజిత్ అభిమానుల మని చెప్పుకుంటూ థియేటర్లో భయానకంగా ప్రవర్తించారు. బూతులు తిడుతూ రెచ్చిపోయారు. స్క్రీన్ డ్యామేజ్ చేశారు. ఇలాంటి కొందరు వ్యక్తుల వల్ల అభిమానులందరికీ చెడ్డపేరు వస్తుంది' అని ట్వీట్ చేశారు.
ఇకపై నో స్పెషల్ షో
మూవీ 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చెన్నైలో ఈ స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. అభిమానుల పేరుతో కొందరు థియేటర్లో విధ్వంసం సృష్టించడం, అనుచితంగా ప్రవర్తించడం లాంటివి చేసిన నేపథ్యంలో ఇకపై రోహిణి సిల్వర్ స్క్రీన్స్లో స్పెషల్ షోలే వేయకూడదని యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్ చరణ్ వెల్లడించారు.
విశ్వాసం
అజిత్, నయనతార జంటగా శివ దర్శకత్వంలో రూపొందిన ‘విశ్వాసం' తెలుగు వెర్షన్ ఈరోజు(మార్చి 1) నైజాం, ఆంధ్రాలో విడుదలైంది. ప్రమోషన్స్ నిర్వహించక పోవడంతో ఓపెనింగ్స్ చాలా పూర్గా నమోదయ్యాయి.