Don't Miss!
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సినిమా ఆగిపోలేదని క్లారిఫై చేసాడు
చెన్నై : గౌతంమీనన్ దర్శకత్వంలోని 'వినైతాండి వరువాయా' చిత్రం శింబుకు బిగ్గెస్ట్ హిట్ను అందించిన విషయం తెలిసిందే. యువతను అమితంగా ఆకట్టుకుందీ సినిమా. మళ్లీ శింబుతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు గౌతంమీనన్ ప్రకటించారు. 'సట్టెండ్రు మారుదు వానిలై' అని పేరుపెట్టారు కూడా. కొన్ని రోజుల పాటు చిత్రీకరణ జరిగింది.
తర్వాత గ్యాప్ లభించడంతో మరో చిత్ర కథను సూర్యకు వినిపించారు గౌతం. సూర్యకు నచ్చకపోవడంతో.. ఆ కథ అజిత్ చెంతకు చేరింది. అజిత్ ఒప్పుకోవడంతో సినిమా షూటింగ్ను కూడా ఆరంభించేశారు గౌతం. దీంతో శింబు చిత్రం తాత్కాలికంగా ఆగింది. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయిందని ప్రస్తుతం కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.
దీని గురించి శింబు మాట్లాడుతూ.. '' గౌతం మీనన్ దర్శకత్వంలోని చిత్రం డ్రాప్ కాలేదు. అజిత్ చిత్రం వేగంగా సాగుతున్నందువల్ల తాత్కాలికంగా ఆగింది. ఆ సినిమా ముగిశాక.. తమ సినిమా ప్రారంభమవుతుంది''అని పేర్కొన్నారు.