Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
నడిగర్ సంఘం కార్యాలయంలో అగ్నిప్రమాదం.. నాజర్, విశాల్ రియాక్షన్ ఏంటి?
తమిళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన నడిగర్ సంఘం ఉన్న భవనంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కార్యలయానికి చెందిన ఫర్నీచర్, ఇతర సామాగ్రీతో పాటు కొన్ని విలువైన పత్రాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. సిబ్బంది ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ, అత్యంత ముఖ్యమైన స్టేషనరీ కాలిపోయినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, నడిగర్ సంఘానికి కొత్త భవనం కట్టించేందుకు అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొంత మంది సినీ ప్రముఖుల నుంచి విరాళాలు సైతం సేకరించారు. అలాగే, ఈ సంఘానికి ఉన్న ఆస్తుల వివరాలను కూడా తరచూ వెల్లడిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? నిజంగా ఇది ప్రమాదమేనా? లేకపోతే ఎవరైనా కావాలని ఇలా చేశారా? అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదిలా ఉండగా, దక్షిణ భారత నటీనటుల సంఘంగా పిలువబడే నడిగర్ సంఘాన్ని 1952లో ఎంజీ రామచంద్రన్, ఎన్ఎస్ కృష్ణన్, కే సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. అప్పట్లో మన తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా దీని పరిధిలోనే ఉండేది. కాలక్రమేనా మన పరిశ్రమ దాని నుంచి వేరైపోయింది. ఇక, నడిగర్ సంఘానికి పరిమిత కాలానికి ఎన్నికలు జరుగుతుంటాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో నాజర్ ప్యానెల్ విజయం సాధించింది. సీనియర్ దర్శక నటుడు భాగ్యరాజా, ఐసరీ గణేష్ టీమ్ పోటీ పడటంతో ఎన్నికలు వేడిని పుట్టించాయి. ఈ ఎన్నికల్లో హీరో విశాల్ కీలక పాత్రను పోషించిన విషయం తెలిసిందే.